Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ ఫోన్ వాడొద్దన్నందుకు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు.. ఎక్కడ..?

Webdunia
గురువారం, 3 జనవరి 2019 (18:32 IST)
సెల్ ఫోన్ మాయాజాలంలో యువత పడిపోయిందనేది అందరికీ తెలిసిన విషయమే. సెల్ ఫోన్ లేకుంటే ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితి చాలామంది ఎదుర్కొంటున్నారు. జీవితంలో ఒక భాగం సెల్ ఫోన్ అయిపోయింది. అయితే తన ఫ్రెండ్స్‌తో నిత్యం చాట్ చేస్తూ సెల్ ఫోన్‌కే కుమారుడు అతుక్కుపోతుండటంతో అతడిని మందలించాడు ఓ తండ్రి. దీంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు కుమారుడు. 
 
విజయవాడలోని పాయవరావుపేటలో నివాసముంటున్న గోపీనాథ్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఇంట్లో ఖాళీగా ఉన్నాడు. ఉదయం లేచినప్పటి నుంచి ఫ్రెండ్స్‌తో ఫోన్లో నిత్యం చాట్ చేస్తూ ఉండేవాడు. వాట్సాప్, ఫేస్ బుక్‌లతోనే ఎప్పుడూ పని. దీంతో కుమారుడిని మందలించాడు రంగ. 
 
ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మనస్థాపానికి గురైన గోపీనాథ్ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే తండ్రి అతన్ని అడ్డుకున్నాడు. అయితే అప్పటికే గోపీనాథ్ శరీరం పాక్షికంగా కాలింది. స్థానికంగా ఉన్న ఆసుపత్రికి బాధితుడిని తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Rohit: తను నా లక్కీ చార్మ్.. అందుకే సుందరకాండ చేశాం : నారా రోహిత్

బార్బరిక్.. ఫ్రీగా చూడాల్సిన మూవీ కాదని వాళ్లు డబ్బులు ఇచ్చారు : విజయ్ పాల్ రెడ్డి

సినిమాల్లోనే కాదు.. వ్యక్తిగతంగా లోపాలను వెతుకుతున్నారు : అనుపమ పరమేశ్వరన్

కపుల్ ఫ్రెండ్లీ లో సంతోష్ శోభన్, మానస వారణాసి ల కెమిస్ట్రీ సాంగ్

పవన్ చేతిపై ఉన్న టాటూ అక్షరాలకు అర్థమేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments