Webdunia - Bharat's app for daily news and videos

Install App

వసతి, అతిథి గృహ నిర్మాణానికి భూమి కావాలి.. మహరాష్ట్ర, కేరళకు ఏపీ దేవాదాయ శాఖ

Webdunia
శుక్రవారం, 16 ఆగస్టు 2019 (18:54 IST)
ఆంధ్రప్రదేశ్‌ నుంచి షిరిడీ, శబరిమల ఆలయాలను సందర్శించే యాత్రికులు, భక్తులకు మెరుగైన సౌకర్యాలను ఏర్పాటు చేసే దిశగా రాష్ట్రప్రభుత్వం నడుంబిగించింది. 
 
ఈ క్రమంలో భాగంగా షిరిడీ, శబరిమలలో వసతి, అతిధిగృహ నిర్మాణానికి అవసరమైన భూమిని కేటాయించాల్సిందిగా మహరాష్ట్ర, కేరళ ప్రభుత్వాలను రాష్ట్రప్రభుత్వం కోరనుంది. 
 
ఈ మేరకు చర్యలు చేపట్టాల్సిందిగా దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శిని ఆదేశించారు. 
 
రాష్ట్రం నుంచి ఏటా లక్షలాది మంది భక్తులు షిరిడీ, శబరిమల ఆలయాలను దర్శించుకుంటున్న క్రమంలో షిరిడీ సాయిబాబా సంస్ధాన్‌ ట్రస్ట్, శబరిమల ట్రావెన్‌కోర్‌ దేవస్ధానం ట్రస్ట్‌లతో, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో  సంప్రదించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు దేవాదాయశాఖ ప్రత్యేక కార్యదర్శిని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments