Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరద బాధితులకు అండగా అక్షయ పాత్ర.. ఖాతాలో అరుదైన రికార్డ్

సెల్వి
గురువారం, 5 సెప్టెంబరు 2024 (16:24 IST)
Akshaya Patra
అక్షయపాత్ర వంటశాలలో వరద బాధితుల కోసం ఐదు లక్షల ఫుడ్ ప్యాకెట్లు సిద్ధం చేసింది. అక్షయపాత్ర మరో అరుదైన రికార్డును సాధించింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని హరేరామ హరేకృష్ణ మూవ్​మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించే అక్షయ పాత్ర వరద బాధితుల కోసం భారీగా ఆహార పొట్లాలను పంపిణీ చేసింది. 
 
ప్రభుత్వం, దాతల సహకారంతో ఈ అరుదైన రికార్డు సాధించామని అక్షయపాత్ర అధికారి విలాస దాసప్రభు చెప్పారు. గుంటూరు, చిలకలూరిపేట, తెనాలి పురపాలక సంఘం నుంచి రోజుకు 400 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. 
Akshaya Patra
 
ఆహారాన్ని బాధితుల వద్దకు చేరేవేసేందుకు ఆయా పాఠశాలలు, కళాశాలల యజమానులు ఉచితంగా వాహనాలు పంపుతున్నారు. 
Akshaya Patra
 
విజయవాడలోని సింగ్ నగర్, ప్రకాష్ నగర్ తదితర వరద ప్రభావిత ప్రాంతాలలోని వరద బాధితుల కోసం శ్రీ సాయిమంగ భరద్వాజ సేవ సంస్థానం అక్షయ పాత్ర ఆహార పంపిణీ కోసం ఆహార పొట్లాలను సిద్ధం చేస్తోందని.. ఆహారం సిద్ధం చేసి, ప్యాకింగ్ చేయడంలో వాలంటీర్లు పాలు పంచుకుంటున్నారని అధికారులు తెలిపారు. గత రెండు రోజులుగా 6 లక్షల మందికి భోజనం తయారు చేసి పంపిస్తున్నట్లు విలాస దాసప్రభు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tanushree Dutta: నన్ను వేధిస్తున్నారు, కాపాడండి, తనుశ్రీ కన్నీటి పర్యంతం (video)

Rasi: ప్రేయసిరావే లో శ్రీకాంత్‌ని కొట్టాను, హిట్‌ అయ్యింది, ఉసురే కూడా అవుతుంది : హీరోయిన్‌ రాశి

Mirai: తేజ సజ్జ, రితికా నాయక్ పోస్టర్ తో మిరాయ్ ఫస్ట్ సింగిల్ రానున్నట్లు ప్రకటన

రతన్ టాటా పెళ్లి చేసుకున్నారా? పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం : నిత్యా మీనన్

Suriya: కరుప్పు తో ఇది మన టైం. కుమ్మి పడదొబ్బుతా.. అంటున్న సూర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments