Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రెసిడెంట్ గారు చాలా దెబ్బలు కొట్టారు... బండరాయి బద్ధలవుతుంది : నాగబాబు

Webdunia
శనివారం, 14 మార్చి 2020 (12:59 IST)
ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీతోపాటు... అధికారం కోల్పోయిన పార్టీని మన ప్రెసిడెంట్ గారు చాలా దెబ్బలు కొట్టారని, ఒక రోజున కుళ్లిన రాజకీయాలు అనే బండరాయి బద్ధలవుతుందని సినీ నటుడు, జనసేన నేత నాగబాబు చెప్పుకొచ్చారు. 
 
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో ఆ పార్టీ ముఖ్యనేతలందరూ సమావేశమై ప్రసంగిస్తున్నారు. ఇందులో నాగబాబు మాట్లాడుతూ నాలుగేళ్లలో జనసేన అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. 
 
అలాగే, 'జనసేన ఆవిర్భావ దినోత్సవంలో తొలిసారి మాట్లాడుతున్నాను. ఎక్కువ సమయం మాట్లాడదలుచుకోలేదు. పవన్‌ కల్యాణ్‌, నాదెండ్ల మనోహర్‌ వంటివారు ఉన్నారు. వారు మాట్లాడేందుకు ప్రాధాన్యతనిస్తాను. అందుకే క్లుప్తంగా మాట్లాడుతానని చెప్పారు. 
 
ఇకపోతే, ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో నామినేషన్‌ వేస్తున్నవారిని తన్నడం కత్తులతో పొడవడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అయినప్పటికీ స్థానిక ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు నామినేషన్లు వేశారు. భయపడకండి.. ఇటువంటి బెదిరింపులు మామూలే. ఎందుకంటే హిట్లర్‌ కంటే గొప్పోడు ఎవరూ లేడిక్కడ. అటువంటి వాడే పతనమైపోయాడు. ఇది కూడా ఎంతో కాలం పట్టదు అని జోస్యం చెప్పారు. 
 
'బండరాయి మీద ఓ దెబ్బేస్తే అది పగలదు. 99 దెబ్బలేసినా పగలదు.. 100వ దెబ్బేస్తే పగులుతుంది. మన పవన్‌ కల్యాణ్.. మన ప్రెసిడెంట్‌ గారు చాలా దెబ్బలు కొట్టారు. ఒకరోజు కుళ్లిన రాజకీయాలు అనే బండరాయి బద్దలయ్యే రోజు వస్తుంది. నాలుగేళ్లలో జనసేన అధికారంలోకి వస్తుంది' అని నాగబాబు అన్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments