ఏపీలో 'అభయం' ప్రాజెక్ట్.. ఇంతకీ ఇది ఎందుకు ఉపయోగపడుతుందో తెలుసా?

Webdunia
సోమవారం, 23 నవంబరు 2020 (07:09 IST)
ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టుంది. బాలలు, మహిళల భద్రత కోసం అభయం అనే సరికొత్త ప్రాజెక్ట్ ను తీసుకొచ్చింది. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన నిర్భయ స్కీం లో భాగంగా అభయం అనే ప్రాజెక్టు ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది.

దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దాదాపు లక్ష ఆటో లను అభయం ప్రాజెక్ట్ కిందకు తీసుకురానున్నారు. ప్రతి ఆటో లోనూ అభయం అనే మొబైల్ అప్లికేషన్ ను రవాణాశాఖ అధికారులు ఇన్స్టాల్ చేస్తారు. దీనిలో ఆటో నెంబర్, డ్రైవర్ పేరు, ఇతర వివరాలన్నీ అప్లోడ్ చేస్తారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా ఆటో లో ప్రత్యేకంగా పానిక్ బటన్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆటో లలో ప్రయాణించే మహిళలు, పిల్లలు ఎవరైనా ఆపద ఉన్నట్లు గ్రహిస్తే వెంటనే.. బటన్ ను నొక్కాలి.

ఇలా బటన్ నొక్కిన వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్ కు సమాచారం చేరుతుంది. అంతేకాకుండా బటన్ నొక్కిన వెంటనే ఆటో నుండి హెల్ప్ అని శబ్దం రావడంతో పాటు.. కొద్దీ దూరం వెళ్ళగానే వాహనం ఆటో మ్యాటిక్ గా ఆగిపోతుంది. 
 
ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని సోమవారంనాడు లాంఛనంగా విశాఖపట్నంలో వెయ్యి ఆటోలతో ప్రారంభించబోతున్నారు.  మహిళలు, పిల్లల భద్రత కోసం ఏర్పాటు చేసిన ఈ అప్లికేషన్ ఎంతో ఉపయోగకరంగా ఉందని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు.

అభయం ప్రాజెక్ట్ మొదటి విడతలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. డిసెంబర్ 1వ తేదీన 5 వేల వాహనాలు, వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి లక్ష వాహనాల్లో ఈ తరహా ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు రవాణాశాఖ అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments