Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో ఏడేళ్ల పాపపై అత్యాచారం... నిందితుడి కోసం గాలింపు...

Webdunia
బుధవారం, 30 జనవరి 2019 (12:53 IST)
దేశంలో స్త్రీల భద్రతకు ముప్పు వాటిల్లుతోంది, అత్యాచార దుర్ఘటనలు మరిన్ని జరుగుతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు, మద్యం తాగి పసిపిల్లలను కూడా విడిచిపెట్టడం లేదు. ఇలాంటి ఘటన గుంటూరు జిల్లాలోని రెంటచింతల మండలం తుమురుకోటలో చోటుచేసుకుంది. 
 
జయరాజ్ అనే వ్యక్తి బాగా మద్యం తాగి కన్నబిడ్డ వయస్సు ఉన్న ఏడేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లాడు. అక్కడ అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలికకు తీవ్రంగా రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులు ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు బాలిక పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. ఏం జరిగిందని ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. నేరస్థుడిని పట్టుకోవడానికి అతని ఇంటికి వెళితే అప్పటికే పరారయ్యాడు.
 
స్థానికులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. బాధితురాలు బంధువులతో కలిసి స్థానికులు కూడా మాచర్ల బస్టాండు వద్ద ఆందోళన చేపట్టారు. పోలీసులు ఆందోళన విరమించాలని వేడుకున్నా ప్రయోజనం లేకపోయింది. నిందితుడిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments