Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏడేళ్ల బాలిక శీలాన్ని చిదిమేశాడు... కామాంధుడుకి బాసటగా పోలీసులు...

ఏడేళ్ల బాలిక శీలాన్ని చిదిమేశాడు... కామాంధుడుకి బాసటగా పోలీసులు...
, బుధవారం, 30 జనవరి 2019 (12:35 IST)
గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. ఏడేళ్ళ బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కామాంధుడుని అరెస్టు చేయాల్సిన పోలీసులు.. కామాంధుడుకి అండగా నిలబడ్డారని ఆరోపిస్తూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గుంటూరు జిల్లాలోని రెంటచింతల మండలం తుమ్మర్‌కోట గ్రామంలో మిర్యాల జయరాం అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఏడేళ్ల చిన్నారిపై జయరాం కన్నేశాడు. ఎవరూ లేని సమయంలో ఆమెకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ బాలికను అక్కడే వదిలివేసి నిందితుడు పారిపోయాడు. బాలికను గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు ఆమెను మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 
 
ఈ విషయం పోలీసులకు చేరవేశారు. అయితే, పోలీసులు మాత్రం తాస్కారం చేస్తూ బాధితుడుని అరెస్టు చేయకుండా మిన్నకుండిపోయారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు మాచర్ల పోలీస్ స్టేషన్ ముందు భారీ సంఖ్యలో చేరుకుని ఆందోళనకు దిగారు. నిందితుడిని అరెస్ట్ చేయకుండా పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. 
 
దీంతో రంగంలోకి దిగిన అధికారులు నిందితుడిని వీలైనంత త్వరగా పట్టుకుంటామని బాధిత కుటుంబానికి, గ్రామస్తులకు హామీ ఇచ్చారు. బాలికకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శాంతించారు. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంగారం పరుగులు... మధ్యతరగతి గుండెల్లో గుబులు