Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల ఘాట్ రోడ్డులో కారు బోల్తా, ఎంత స్పీడ్ వెళుతున్నాడంటే..?

Webdunia
శనివారం, 25 డిశెంబరు 2021 (19:14 IST)
అతివేగం ప్రమాదకరం.. వాహనాలను నెమ్మదిగా నడపండి.. వేగం కన్నా ప్రాణం మిన్న అంటూ రకరకాలుగా బోర్డులను ఏర్పాటు చేసి అవగాహన కల్పించే ప్రయత్నం రవాణాశాఖాధికారులు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా పుణ్యక్షేత్రాల వద్ద వాహనాలను నెమ్మదిగా నడపాలని సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. 

 
కానీ చాలామంది భక్తులు నిర్లక్ష్యంగా వాహనాలను నడుపుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తిరుమల ఎగువ ఘాట్ రోడ్డులో కారు బోల్తా పడింది. అతి వేగంగా కారును నడపటంతోనే కారు బోల్తా పడినట్లు గుర్తించారు టిటిడి సిబ్బంది. 

 
ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. మిగిలిన ముగ్గురు స్వల్పగాయాలతో బయటపడ్డారు. లింక్ రోడ్డు సమీప మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణించే వారు నెల్లూరు జిల్లా వాసులుగా గుర్తించారు. 130 కిలో మీటర్లకు పైగా వేగంగా కారు నడిపినట్లు తెలుస్తోంది. 

 
ప్రమాదం జరిగిన తరువాత స్పీడామీటర్ ముళ్ళు 130వద్ద నిలిచిపోయింది. ఘాట్ రోడ్డులో అంత వేగంగా వాహనాలను నడుపకూడదని తెలిసినా నెల్లూరుజిల్లా నుంచి వచ్చిన భక్త బృందం ఎందుకు అంత స్పీడుగా వాహనాన్ని నడపారు అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments