Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల ఘాట్ రోడ్డులో కారు బోల్తా, ఎంత స్పీడ్ వెళుతున్నాడంటే..?

Webdunia
శనివారం, 25 డిశెంబరు 2021 (19:14 IST)
అతివేగం ప్రమాదకరం.. వాహనాలను నెమ్మదిగా నడపండి.. వేగం కన్నా ప్రాణం మిన్న అంటూ రకరకాలుగా బోర్డులను ఏర్పాటు చేసి అవగాహన కల్పించే ప్రయత్నం రవాణాశాఖాధికారులు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా పుణ్యక్షేత్రాల వద్ద వాహనాలను నెమ్మదిగా నడపాలని సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. 

 
కానీ చాలామంది భక్తులు నిర్లక్ష్యంగా వాహనాలను నడుపుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తిరుమల ఎగువ ఘాట్ రోడ్డులో కారు బోల్తా పడింది. అతి వేగంగా కారును నడపటంతోనే కారు బోల్తా పడినట్లు గుర్తించారు టిటిడి సిబ్బంది. 

 
ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. మిగిలిన ముగ్గురు స్వల్పగాయాలతో బయటపడ్డారు. లింక్ రోడ్డు సమీప మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణించే వారు నెల్లూరు జిల్లా వాసులుగా గుర్తించారు. 130 కిలో మీటర్లకు పైగా వేగంగా కారు నడిపినట్లు తెలుస్తోంది. 

 
ప్రమాదం జరిగిన తరువాత స్పీడామీటర్ ముళ్ళు 130వద్ద నిలిచిపోయింది. ఘాట్ రోడ్డులో అంత వేగంగా వాహనాలను నడుపకూడదని తెలిసినా నెల్లూరుజిల్లా నుంచి వచ్చిన భక్త బృందం ఎందుకు అంత స్పీడుగా వాహనాన్ని నడపారు అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments