Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల ఘాట్ రోడ్డులో కారు బోల్తా, ఎంత స్పీడ్ వెళుతున్నాడంటే..?

Webdunia
శనివారం, 25 డిశెంబరు 2021 (19:14 IST)
అతివేగం ప్రమాదకరం.. వాహనాలను నెమ్మదిగా నడపండి.. వేగం కన్నా ప్రాణం మిన్న అంటూ రకరకాలుగా బోర్డులను ఏర్పాటు చేసి అవగాహన కల్పించే ప్రయత్నం రవాణాశాఖాధికారులు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా పుణ్యక్షేత్రాల వద్ద వాహనాలను నెమ్మదిగా నడపాలని సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. 

 
కానీ చాలామంది భక్తులు నిర్లక్ష్యంగా వాహనాలను నడుపుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తిరుమల ఎగువ ఘాట్ రోడ్డులో కారు బోల్తా పడింది. అతి వేగంగా కారును నడపటంతోనే కారు బోల్తా పడినట్లు గుర్తించారు టిటిడి సిబ్బంది. 

 
ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. మిగిలిన ముగ్గురు స్వల్పగాయాలతో బయటపడ్డారు. లింక్ రోడ్డు సమీప మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణించే వారు నెల్లూరు జిల్లా వాసులుగా గుర్తించారు. 130 కిలో మీటర్లకు పైగా వేగంగా కారు నడిపినట్లు తెలుస్తోంది. 

 
ప్రమాదం జరిగిన తరువాత స్పీడామీటర్ ముళ్ళు 130వద్ద నిలిచిపోయింది. ఘాట్ రోడ్డులో అంత వేగంగా వాహనాలను నడుపకూడదని తెలిసినా నెల్లూరుజిల్లా నుంచి వచ్చిన భక్త బృందం ఎందుకు అంత స్పీడుగా వాహనాన్ని నడపారు అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments