Webdunia - Bharat's app for daily news and videos

Install App

8 యేళ్ళ బాలికపై ఐదుగురు బాలురు సామూహిక అత్యాచారం

గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. ఎనిమిదేళ్ళ బాలికపై ఐదుగురు బాలురు సామూహికంగా అత్యాచారం చేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన పట్టాభిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని విద్యానగర్‌లో ఈ నెల 24న జరిగింది.

Webdunia
సోమవారం, 30 ఏప్రియల్ 2018 (08:52 IST)
గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. ఎనిమిదేళ్ళ బాలికపై ఐదుగురు బాలురు సామూహికంగా అత్యాచారం చేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన పట్టాభిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని విద్యానగర్‌లో ఈ నెల 24న జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. రెండో తరగతి చదువుతున్న బాలికను ఆరో తరగతి చదువుతున్న 10 - 12 ఏళ్ల వయసున్న ఐదుగురు బాలురు సమీపంలోని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు.
 
బాధిత కుటుంబం కొద్ది నెలల కిందటే బతుకుదెరువు కోసం క్రోసూరు మండలం నుంచి నగరానికి వలస వచ్చి విద్యానగర్‌లో నివాసం ఉంటోంది. బాలిక తండ్రి అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా, తల్లి ఇళ్లలో పాచి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. 
 
తమ కుమార్తె కనిపించకపోవడంతో తల్లి, బాలిక అక్క వెతుక్కుంటూ వెళ్తుండగా చెట్ల పొదల్లో అలికిడి కావడంతో అక్కడకు వెళ్లారు. వారిని చూసి బాలురు పరార్‌ కాగా బాధితురాలిని ఇంటికి తీసుకెళ్లారు. ఈ ఘటనలో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక, ఫోక్సో తదితర చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం