Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కదులుతున్న కారులో ఆరుగురు కామాంధులు ఒక యువతిని...

మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఒంటరిగా వెళ్ళే మహిళలను టార్గెట్ చేస్తున్నారు కామాంధులు. అవకాశం దొరికితే చాలు మహిళలను నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్ళి అత్యాచారం చేసేస్తున్నారు. అలాంటి సంఘటనే ఢిల్లీలో జరిగింది.

కదులుతున్న కారులో ఆరుగురు కామాంధులు ఒక యువతిని...
, శుక్రవారం, 27 ఏప్రియల్ 2018 (20:11 IST)
మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఒంటరిగా వెళ్ళే మహిళలను టార్గెట్ చేస్తున్నారు కామాంధులు. అవకాశం దొరికితే చాలు మహిళలను నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్ళి అత్యాచారం చేసేస్తున్నారు. అలాంటి సంఘటనే ఢిల్లీలో జరిగింది. 
 
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న 22 యేళ్ళ యువతి సెక్టార్ 126కు వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకుంది. క్యాబ్ తన వద్దకు రాగానే అందులో అప్పటికే ఒక ప్రయాణీకుడు ఉన్నాడు. డ్రైవర్ యువతికి నచ్చజెప్పి మరో రెండు కిలోమీటర్ల దూరంలో అతను దిగేస్తాడని చెప్పాడు. దీంతో నమ్మిన యువతి కారు ఎక్కింది. కొద్ది దూరం వెళ్ళగానే కారును జర్చా అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్ళాడు డ్రైవర్. వెనుక ఉన్న ప్రయాణీకుడు బలవంతంగా ఆమెను పట్టుకుని మద్యం తాగించాడు. 
 
మద్యం మత్తులో పడిపోయిన యువతిపై ప్రయాణీకుడు, కారు డ్రైవర్ అత్యాచారం చేశారు. ఆ తరువాత డ్రైవర్ తన స్నేహితులు నలుగురిని పిలిపించి యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. స్పృహ వచ్చిన యువతి తాను అత్యాచారానికి గురైనట్లు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులు పరారీలో ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ద్యావుడా.. శ్రీరెడ్డి గురించి మాట్లాడాలా? పరుగులు తీసిన బ్రహ్మానందం...