Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిమ్ జోంగ్ ఉన్ స్నేహాస్తం : అణు పరీక్షలకు ఉత్తర కొరియా స్వస్తి

నిన్నమొన్నటివరకు బద్ధశత్రువులుగా మెలిగిన ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య స్నేహం వెల్లివిరిసింది. పాతకాలపు వైరాన్ని పక్కనబెట్టి ముందుకుసాగాలని ఈ రెండు దేశాధినేతలు నిర్ణయించారు.

Webdunia
సోమవారం, 30 ఏప్రియల్ 2018 (08:29 IST)
నిన్నమొన్నటివరకు బద్ధశత్రువులుగా మెలిగిన ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య స్నేహం వెల్లివిరిసింది. పాతకాలపు వైరాన్ని పక్కనబెట్టి ముందుకుసాగాలని ఈ రెండు దేశాధినేతలు నిర్ణయించారు. ఇందులోభాగంగా, అణు పరీక్షలకు స్వస్తి చెప్పనున్నట్టు ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ప్రకటించారు. ఇందుకోసం అణు పరీక్షల కేంద్రాన్ని మే నెలలో మూసివేస్తామని, ఆ ప్రక్రియను పరిశీలించేందుకు అమెరికా నిపుణులకు కూడా ఆహ్వానిస్తున్నట్టు ఉత్తర కొరియా ప్రకటించింది.
 
ఈనెల 27వ తేదీ శుక్రవారం ఉభయ కొరియాల అధ్యక్షులు కిమ్‌ జాంగ్‌ ఉన్‌, మూన్‌ జే ఇన్‌‌లు కీలక సమావేశం నిర్వహించిన విషయం తెల్సిందే. దక్షిణాఫ్రికా గడ్డపై కాలుమోపిన కింమ్ జోంగ్ ఉన్ చరిత్ర సృష్టించిన విషయం తెల్సిందే. ఆ తర్వాత దక్షిణ కొరియా అధినేత మూన్ జే ఇన్‌తో కలిసి ఇరు దేశాల సంబంధాలతో పాటు పలు అంశాలపై చర్చలు జరిపి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 
 
కొరియా ద్వీపకల్పంలో సంపూర్ణ అణు నిరాయుధీకరణకు ఇరువురు నేతలు ఆ సమావేశంలో అంగీకారం తెలిపారు. ఆ సందర్భంలోనే వచ్చేనెలలో అణు పరీక్షల కేంద్రాన్ని మూసివేస్తానని మూన్‌కు కిమ్‌ తెలిపారు. ఆ ఘట్టాన్ని పరిశీలించేందుకు, పారదర్శకంగా అంతర్జాతీయ సమాజానికి తెలియజేసేందుకు దక్షిణకొరియా, అమెరికా నిపుణులకు, విలేకరులకు కిమ్‌ ఆహ్వానం పలికారని దక్షిణ కొరియా అధినేత మూన్‌ జే ఇన్‌ అధికార ప్రతినిధి యూన్‌ యంగ్చాన్‌ ఆదివారం ఇక్కడ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela in 2025: గుంటూరు కారం తర్వాత బ్రేక్.. మళ్లీ కొత్త ప్రాజెక్టులతో శ్రీలీల బిజీ బిజీ

Brahmanandam: హాస్యనటుడు వృత్తి నిజంగా పవిత్రమైనది : బ్రహ్మానందం

Rashmika : సక్సెస్ క్వీన్ గా మారిన నేషనల్ క్రష్ రశ్మిక మందన్న

Ram: రామ్ పోతినేని 22వ చిత్రం రాజమండ్రి షెడ్యూల్ పూర్తి

Vishwak Sen: విశ్వక్ సేన్ ఇంట్లో జరిగిన చోరీ కేసు.. చేధించిన పోలీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments