Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిమ్ జోంగ్ ఉన్ స్నేహాస్తం : అణు పరీక్షలకు ఉత్తర కొరియా స్వస్తి

నిన్నమొన్నటివరకు బద్ధశత్రువులుగా మెలిగిన ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య స్నేహం వెల్లివిరిసింది. పాతకాలపు వైరాన్ని పక్కనబెట్టి ముందుకుసాగాలని ఈ రెండు దేశాధినేతలు నిర్ణయించారు.

Webdunia
సోమవారం, 30 ఏప్రియల్ 2018 (08:29 IST)
నిన్నమొన్నటివరకు బద్ధశత్రువులుగా మెలిగిన ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య స్నేహం వెల్లివిరిసింది. పాతకాలపు వైరాన్ని పక్కనబెట్టి ముందుకుసాగాలని ఈ రెండు దేశాధినేతలు నిర్ణయించారు. ఇందులోభాగంగా, అణు పరీక్షలకు స్వస్తి చెప్పనున్నట్టు ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ప్రకటించారు. ఇందుకోసం అణు పరీక్షల కేంద్రాన్ని మే నెలలో మూసివేస్తామని, ఆ ప్రక్రియను పరిశీలించేందుకు అమెరికా నిపుణులకు కూడా ఆహ్వానిస్తున్నట్టు ఉత్తర కొరియా ప్రకటించింది.
 
ఈనెల 27వ తేదీ శుక్రవారం ఉభయ కొరియాల అధ్యక్షులు కిమ్‌ జాంగ్‌ ఉన్‌, మూన్‌ జే ఇన్‌‌లు కీలక సమావేశం నిర్వహించిన విషయం తెల్సిందే. దక్షిణాఫ్రికా గడ్డపై కాలుమోపిన కింమ్ జోంగ్ ఉన్ చరిత్ర సృష్టించిన విషయం తెల్సిందే. ఆ తర్వాత దక్షిణ కొరియా అధినేత మూన్ జే ఇన్‌తో కలిసి ఇరు దేశాల సంబంధాలతో పాటు పలు అంశాలపై చర్చలు జరిపి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 
 
కొరియా ద్వీపకల్పంలో సంపూర్ణ అణు నిరాయుధీకరణకు ఇరువురు నేతలు ఆ సమావేశంలో అంగీకారం తెలిపారు. ఆ సందర్భంలోనే వచ్చేనెలలో అణు పరీక్షల కేంద్రాన్ని మూసివేస్తానని మూన్‌కు కిమ్‌ తెలిపారు. ఆ ఘట్టాన్ని పరిశీలించేందుకు, పారదర్శకంగా అంతర్జాతీయ సమాజానికి తెలియజేసేందుకు దక్షిణకొరియా, అమెరికా నిపుణులకు, విలేకరులకు కిమ్‌ ఆహ్వానం పలికారని దక్షిణ కొరియా అధినేత మూన్‌ జే ఇన్‌ అధికార ప్రతినిధి యూన్‌ యంగ్చాన్‌ ఆదివారం ఇక్కడ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments