Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పులస చేప ధర వింటే గుండె గుభేల్...

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2022 (10:11 IST)
చేపల్లోకెల్లా పులస చేప గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చేపల రుచే వేరు. ఈ చేపలను ఒక్కసారి తింటే జీవితాంతం మరచిపోలేరు. అందుకే ఈ పులస చేపల ధర చాలా ఖరీదుగానే ఉంటుంది. అందుకే తమ వలలో ఒక్క పులస చేపపడితే చాలని జాలర్లు తమ ఆ గంగమ్మ తల్లిని ప్రార్థిస్తుంటారు. 
 
తాజాగా గోదావరి నది వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. దీంతో పులస చేపలు గోదావరి నది నీటికి ఎదురీదుతూ.. జాలర్ల వలకు చిక్కుతున్నాయి. దీంతో యానాం మార్కెట్‌లో వాటి విక్రయాలు కూడా ఊపందుకున్నాయి. మంగళవారం మార్కెట్‌లో రెండు కిలోల పులస చేపను వేలం వేశారు. ఇది కనీవినీ ఎరుగని రీతిలో ధర పలికింది. 
 
ఒక్క పులస చేప ఏకంగా రూ.19 వేల ధరకు అమ్ముడుపోయింది. ఈ చేపను పార్వతి అనే మహిళ దక్కించుకున్నారు. ఆ తర్వాత ఈ చేపను భైరవపాలెంకు చెందిన ఓ వ్యక్తికి రూ.20 వేలకు విక్రయించారు. ఈ సీజన్‌లో లభించిన పులస చేపల్లో అత్యధికంగా అమ్ముడుపోయిన ధర ఇదేనని యానాం వ్యాపారులు అంటున్నారు. 
 
కాగా, ఐ పోలవరం మండలం భైరవపాలెం మొగ వద్ద ఇసుక మేటలు వేయడం వల్ల సముద్రంలోంచి గౌతమి పాయలోకి పులసలు చాలా తక్కువగా ఉన్నట్టు పేర్కొన్నారు. అయితే, ఇదే చేప సముద్రంలో లభిస్తే మాత్రం దీన్ని వలస చేప అని అంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీర్ఘాయుష్మాన్ భవన్.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments