Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పులస చేప ధర వింటే గుండె గుభేల్...

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2022 (10:11 IST)
చేపల్లోకెల్లా పులస చేప గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చేపల రుచే వేరు. ఈ చేపలను ఒక్కసారి తింటే జీవితాంతం మరచిపోలేరు. అందుకే ఈ పులస చేపల ధర చాలా ఖరీదుగానే ఉంటుంది. అందుకే తమ వలలో ఒక్క పులస చేపపడితే చాలని జాలర్లు తమ ఆ గంగమ్మ తల్లిని ప్రార్థిస్తుంటారు. 
 
తాజాగా గోదావరి నది వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. దీంతో పులస చేపలు గోదావరి నది నీటికి ఎదురీదుతూ.. జాలర్ల వలకు చిక్కుతున్నాయి. దీంతో యానాం మార్కెట్‌లో వాటి విక్రయాలు కూడా ఊపందుకున్నాయి. మంగళవారం మార్కెట్‌లో రెండు కిలోల పులస చేపను వేలం వేశారు. ఇది కనీవినీ ఎరుగని రీతిలో ధర పలికింది. 
 
ఒక్క పులస చేప ఏకంగా రూ.19 వేల ధరకు అమ్ముడుపోయింది. ఈ చేపను పార్వతి అనే మహిళ దక్కించుకున్నారు. ఆ తర్వాత ఈ చేపను భైరవపాలెంకు చెందిన ఓ వ్యక్తికి రూ.20 వేలకు విక్రయించారు. ఈ సీజన్‌లో లభించిన పులస చేపల్లో అత్యధికంగా అమ్ముడుపోయిన ధర ఇదేనని యానాం వ్యాపారులు అంటున్నారు. 
 
కాగా, ఐ పోలవరం మండలం భైరవపాలెం మొగ వద్ద ఇసుక మేటలు వేయడం వల్ల సముద్రంలోంచి గౌతమి పాయలోకి పులసలు చాలా తక్కువగా ఉన్నట్టు పేర్కొన్నారు. అయితే, ఇదే చేప సముద్రంలో లభిస్తే మాత్రం దీన్ని వలస చేప అని అంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments