ఆ పులస చేప ధర వింటే గుండె గుభేల్...

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2022 (10:11 IST)
చేపల్లోకెల్లా పులస చేప గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చేపల రుచే వేరు. ఈ చేపలను ఒక్కసారి తింటే జీవితాంతం మరచిపోలేరు. అందుకే ఈ పులస చేపల ధర చాలా ఖరీదుగానే ఉంటుంది. అందుకే తమ వలలో ఒక్క పులస చేపపడితే చాలని జాలర్లు తమ ఆ గంగమ్మ తల్లిని ప్రార్థిస్తుంటారు. 
 
తాజాగా గోదావరి నది వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. దీంతో పులస చేపలు గోదావరి నది నీటికి ఎదురీదుతూ.. జాలర్ల వలకు చిక్కుతున్నాయి. దీంతో యానాం మార్కెట్‌లో వాటి విక్రయాలు కూడా ఊపందుకున్నాయి. మంగళవారం మార్కెట్‌లో రెండు కిలోల పులస చేపను వేలం వేశారు. ఇది కనీవినీ ఎరుగని రీతిలో ధర పలికింది. 
 
ఒక్క పులస చేప ఏకంగా రూ.19 వేల ధరకు అమ్ముడుపోయింది. ఈ చేపను పార్వతి అనే మహిళ దక్కించుకున్నారు. ఆ తర్వాత ఈ చేపను భైరవపాలెంకు చెందిన ఓ వ్యక్తికి రూ.20 వేలకు విక్రయించారు. ఈ సీజన్‌లో లభించిన పులస చేపల్లో అత్యధికంగా అమ్ముడుపోయిన ధర ఇదేనని యానాం వ్యాపారులు అంటున్నారు. 
 
కాగా, ఐ పోలవరం మండలం భైరవపాలెం మొగ వద్ద ఇసుక మేటలు వేయడం వల్ల సముద్రంలోంచి గౌతమి పాయలోకి పులసలు చాలా తక్కువగా ఉన్నట్టు పేర్కొన్నారు. అయితే, ఇదే చేప సముద్రంలో లభిస్తే మాత్రం దీన్ని వలస చేప అని అంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మంచి ప్రేమ కథతో వస్తున్న లవ్ డేస్ పెద్ద విజయం సాధించాలి : సముద్ర

వైభవంగా వంశీకృష్ణ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం

Venkatesh: మళ్ళీ పెళ్లి చేసుకుందాం అంటున్న విక్టరీ వెంకటేష్

Savitri : సావిత్రి 90 వ జయంతి సభ - మహానటి చిత్ర దర్శక నిర్మాతలకు సత్కారం

Prabhas: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రాజా సాబ్ పాట... ఆట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments