Webdunia - Bharat's app for daily news and videos

Install App

2 బ్యాగుల నిండా బంగారం.. అది పులివెందులదేనా?

Webdunia
బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (09:47 IST)
పంచాయతీ ఎన్నికల వేళ వైఎస్సార్ కడప జిల్లాలో భారీగా బంగారం పట్టుబడింది. కడప- తాడిపత్రి ప్రధాన రహదారిలోని ముద్దనూరు నాలుగు రోడ్ల కూడలి వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టగా.. పులివెందుల నుంచి వస్తున్న ఓ కారులో 2.7 కేజీల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సీఐ హరినాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ముద్దనూరు నాలుగు రోడ్ల కూడలి వద్ద వాహనాల తనిఖీ చేస్తున్నారు.
 
అదే సమయంలో పులివెందుల నుంచి ముద్దనూరు వైపు వస్తున్న ఓ కారును నిలిపివేశారు. ఈ సందర్భంగా కారులో తనిఖీ చేపట్టగా.. అందులో ఉన్న రెండు బ్యాగుల్లో 2.7 కేజీల బంగారు ఆభరణాలను గుర్తించారు. వెంటనే కారు డ్రైవర్‌ మహమ్మద్‌ షఫీని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. పులివెందులలోని ఓ బంగారు ఆభరణాల దుకాణం నుంచి మెరుగు పెట్టించడానికి ప్రొద్దుటూరుకు తీసుకెళుతున్నట్లు చెప్పాడు.
 
అయితే ఆభరణాలకు సంబంధించిన బిల్లులు లేకపోవటంతో కారుతో పాటు ఆభరణాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.1.05 కోట్లు ఉంటుందని సీఐ తెలిపారు. స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలను తిరుపతి ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అందించినట్లు సీఐ హరినాథ్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments