Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో ఫ్యాను జోరు.. సైకిల్‌కు పంక్చర్?

Webdunia
గురువారం, 23 మే 2019 (09:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో వైఎస్. జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ముందంజలో ఉంది. గురువారం ఉదయం మొదలైన ఓట్ల లెక్కింపుల్లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకుగాను వైకాపా 70 చోట్ల, టీడీపీ 20 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. అలాగే, లోక్‌సభ ఎన్నికల్లో కూడా వైకాపా ఒక చోట ఆధిక్యంలో ఉంది. 
 
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన విషయం తెల్సిందే. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ లీడ్‌లో ఉంది. పోస్టల్, సర్వీస్ ఓట్ల లెక్కింపులో వైసీపీ జోరు కనిపించింది. వైసీపీ 70 అసెంబ్లీ స్థానాల్లో ముందు ఉంటే.. టీడీపీ 20 స్థానంలో మాత్రమే లీడ్‌లో ఉంది. లోక్‌సభ ఫలితాల విషయానికి వస్తే.. వైసీపీ ఆధిపత్యం కనిపిస్తోంది. ఆ పార్టీ ఒక స్థానంలో లీడ్‌లో ఉంది. ఇక జనసేన ఊసే లేదు. 
 
మరోవైపు, సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. ఉదయం 9 గంటల ట్రెండ్స్ మేరకు 199 చోట్ల బీజేపీ కూటమి ఆధిక్యంలో ఉండగా, యూపీఏ 85, ఇతరులు 60 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments