Webdunia - Bharat's app for daily news and videos

Install App

22న టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి..

Webdunia
బుధవారం, 19 జూన్ 2019 (18:13 IST)
పవిత్ర పుణ్యక్షేత్రం అయిన తిరుమలలో కొన్నిరోజులుగా రాజకీయ దుమారం చెలరేగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు సభ్యులుగా ఉన్న వారు కొంతమంది రాజీనామాలు చేసారు. అయితే తితిదే ఛైర్మన్‌గా ఉన్న పుట్టా సుధాకర్‌ యాదవ్‌ రాజీనామా చేయడానికి ససేమిరా ఒప్పుకోలేదు. 
 
నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం తనను తొలగించేంత వరకు కొనసాగుతానని చెప్పారు. అయితే ఈరోజు పుట్టా సుధాకర్‌ యాదవ్‌ తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేసారు. తన రాజీనామా లేఖను తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో సింఘాల్‌కు అందజేసారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వైవీసుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. 
 
ఈనెల 22వ తేదీన ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇదివరకే పలువురు టీటీడీ బోర్డు సభ్యులు రాజీనామా చేసిన సంగతి విదితమే. కాగా ఈనెల 22వ తేదీనే టీటీడీ బోర్డు కొత్త సభ్యులు సైతం ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments