Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాన్సాస్ ట్రస్ట్ భూములపై వైకాపా గద్దల కన్నుపడింది : చంద్రబాబు

Webdunia
బుధవారం, 3 జూన్ 2020 (17:18 IST)
విజయనగరం జిల్లాలో పూసపాటి వంశీయులు నెలకొల్పిన మాన్సాన్ ట్రస్టుకు చెందిన కోట్లాది రూపాయల విలువ చేసే భూములపై వైసీపీ గద్దల కన్నుపడిందనీ, ఈ భూములను కాజేసేందుకు వైకాపా పెద్దలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన బుధవారం ఓ ట్వీట్ చేశారు. 
 
"నమాన్సాస్ ట్రస్టుకు సంబంధించిన రూ.1.30 లక్షల కోట్ల విలువైన భూములపై వైసీపీ ప్రభుత్వం కన్నేసింది. ఈ భూములు కాజేసేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
'మాన్సాస్ ట్రస్ట్ అన్నది ఉన్నతమైన లక్ష్యాలతో పూసపాటి వంశీయులు స్థాపించిన సంస్థ. ఆ సంస్థ కింద 105 దేవాలయాలతో పాటు, ఎన్నో విద్యాలయాలు ఉన్నాయి. సంస్థకున్న పవిత్ర ఆశయాలను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశంతో సహా ఏ పార్టీ అధికారంలో ఉన్నా సంస్థ విషయాల్లో జోక్యం చేసుకోలేదు.
 
అలాంటిది రూ.1 లక్షా 30 వేల కోట్లకు పైగా విలువ చేసే ట్రస్ట్ భూముల మీద కన్నేసి, కాజేయడానికి వైసీపీ పెద్దలు అధికార దుర్వినియోగం చేస్తున్నారు. తండ్రి ఆశయాలను బతికించుకోవటానికి అశోక్ గజపతిరాజు తపన పడుతున్నారు. ఆయనకు అందరూ అండగా నిలవాలి. ఒక పవిత్ర సంకల్పాన్ని బతికించాలి' అని చెప్పారు. అలాగే, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు మాట్లాడుతున్న వీడియోను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments