Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీకి మద్దతిచ్చి కేసులు మాఫీ చేయించుకుంటారా? ఆర్ఆర్ఆర్ ప్రశ్న

Webdunia
శుక్రవారం, 27 మే 2022 (09:22 IST)
దేశంలో త్వరలోనే రాష్ట్రపతి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీపి వైకాపా పార్టీ మద్దతు ఇవ్వనుంది. దీనిపై ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు స్పందించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తేనే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిస్తామని చెప్పే దమ్మూధైర్యం వైకాపా పెద్దలకు ఉందా అంటూ సూటిగా ప్రశ్నించారు.
 
ఇదే అంశంపై ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ, గత రాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్రపతిగా దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నిలబెట్టడం వల్ల బీజేపీకి స్వచ్చంధంగా మద్దతు ఇచ్చామని వైకాపా నేతలు చెప్పారని గుర్తు చేశారు. 
 
ఈ దఫా బీజేపీ అడిగితే మద్దతిచ్చే అంశాన్ని పరిశీలిస్తామని విజయసాయి రెడ్డి చెప్పడం విస్మయానికి గురిచేసిందన్నారు. ఎందుకంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై సంతకం పెడితేనే ఈసారి మద్దతిస్తామని చెప్పగలరా అని విజయసాయిని ప్రశ్నించారు. 
 
అలాకాకుండా, వివేకానంద రెడ్డి హత్య కేసులో తమ వారి ప్రమేయం లేదని, అలాగే, తనపై ఉన్న కేసుల్లో నిర్దోషిగా ప్రకటించాలని విజయసాయి కోరే అవకాశం ఉందా అని రఘురామ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments