Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేటి వైకాపా సామాజిక న్యాయభేరీ పేరుతో బస్సు యాత్ర

ysrcp flag
, గురువారం, 26 మే 2022 (08:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార పార్టీ నేతలు గురువారం నుంచి సామాజిక న్యాయభేరీ పేరుతో బస్సు యాత్రను ప్రారంభించనుంది. ఇప్పటికే రాష్ట్రంలో చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం చేపట్టిన యాత్రకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేక రావడంతో వైకాపా నేతలు గ్రామాల్లో తిరగలేక తమ ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రజల నుంచి చీవాట్లు తప్పించుకునేందుకు ఇపుడు బస్సు యాత్రను వైకాపా నేతలు చేపట్టారు. 
 
శ్రీకాకుళం నుంచి ఈ యాత్ర ప్రారంభిస్తారు. రాష్ట్ర మంత్రివర్గంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గానికి చెందిన మంత్రులు బస్సుల్లో రాష్ట్రమంతా పర్యటిస్తూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి తదితర అంశాలను ప్రచారం చేస్తారు. ఆ దిశగా ఈ బస్సు యాత్రకు రూపకల్పన చేశారు 
 
గురువారం ఉదయం తొలుత మంత్రుల బృందం శ్రీకాకుళంలోని ప్రసిద్ధ దేవాలయం అరసవల్లి ఆదిత్యుడ్ని దర్శించుకుంటారు. అనంతరం ఏడురోడ్ల జంక్షన్‌ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. ఆ తర్వాత బస్సులో బయల్దేరి ఇతర జిల్లాలకు యాత్ర కొనసాగిస్తారు. మంత్రుల యాత్రను దృష్టిలో ఉంచుకుని ఉదయం 8 నుంచి 11 గంటల వరకు  శ్రీకాకుళం నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేడు హైదరాబాద్‌లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు