Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్‍లో లోయలో పడిన కారు - 9 మంది మృత్యువాత

Webdunia
శుక్రవారం, 27 మే 2022 (08:50 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని సెంట్రల్ కాశ్మీర్‌లో ఘోరం జరిగింది. ఓ కారు లోయలో పడిన ఘటనలో మొత్తం 9 మంది మృత్యువాతపడ్డారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. కాశ్మీర్‌లోని కార్గిల్ నగరం నుండి శ్రీనగర్ వైపు వెళుతున్న కారు ఒకటి గంధర్‌పాల్ జిల్లా శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారికి వెళుతుండగా ఆ కారు నియంత్రణ కోల్పోయి సమీపంలో ఉన్న భారీ లోయలోకి దూసుకెళ్లింది. 
 
దీంతో అందులో ప్రయాణిసున్న వారిలో 9 మంది చనిపోయారు. ఘటనా స్థలంలో నలుగురు చనిపోగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఐదుగురు ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
దీనిపై పోలీసులు స్పందిస్తూ, ప్రయాణికులతో కూడిన కారు కార్గిల్ నుంచి సోనామార్గ్‌కు వెళ్తుండగా రాత్రి రోడ్డుపై నుంచి జారిపడి 400 అడుగుల మేర బోల్తా పడిందని అధికారులు తెలిపారు. ప్రమాద స్థలం నుంచి మృతుల మృతదేహాలను వెలికితీసి గుర్తించారు. మృతి చెందిన వారిలో గుజరాత్, జార్ఖండ్, పంజాబ్, ఛత్తీస్‌గఢ్‌లకు చెందిన సందర్శకులు ఉన్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anna konidala: డిక్లరేషన్ పై సంతకం పెట్టి స్వామి కి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల

ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

Sathyaraj: ఆకట్టుకునేలా త్రిబాణధారి బార్బారిక్‌ లో తాత, మనవరాలి సాంగ్ : సత్యరాజ్

Rajamouli : ఆస్కార్‌ కేటగిరిలో స్టంట్ డిజైన్ వుండడం పట్ల రాజమౌళి హర్షం

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments