Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జమ్మూకాశ్మీర్‌‍లో ఉగ్రమూకల దాడి.. పోలీస్ కానిస్టేబుల్ మృతి

జమ్మూకాశ్మీర్‌‍లో ఉగ్రమూకల దాడి.. పోలీస్ కానిస్టేబుల్ మృతి
, మంగళవారం, 24 మే 2022 (19:54 IST)
జమ్మూ కాశ్మీర్‌‌లో ఉగ్రవాదులు పెచ్చరిల్లిపోతున్నారు. తాజాగా ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ ఇంటి వద్ద కాల్పులు జరిపారు. ఏడేళ్ల కూతురి ముందే అతడిని కాల్చేశారు. ఈ దాడిలో పోలీస్‌ కానిస్టేబుల్‌ మృతిచెందగా.. అతడి కూతురికి గాయాలైనట్టు పోలీసులు వెల్లడించారు. 
 
ఉగ్రదాడిలో తొలుత తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. ఈ దాడిలో మృతి చెందిన పోలీస్‌ను శ్రీనగర్‌లోని సౌరా ప్రాంతానికి చెందిన సైఫుల్లా ఖాద్రిగా గుర్తించినట్టు తెలిపారు. 
 
అయితే, బాలిక కుడి చేతికి బుల్లెట్‌ గాయం తగిలిందని.. ఆమె ప్రాణాలకు ప్రమాదం లేదన్నారు. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. మరోవైపు, ఈ ఘటనపై కాశ్మీర్‌ రేంజ్‌ ఐజీ విజయ్‌ కుమార్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

20 ఏళ్ల తర్వాత కేటీఆర్ భారత ప్రధాని కావొచ్చు.. ఆశా జడేజా