కుప్పం మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. అధికార వైకాపా చెందిన అభ్యర్థులు విజయభేరీ మోగించింది. ముఖ్యంగా, టీడీపీకి కంచుకోటల్లో ఒకటిగా ఉన్న కుప్పంలో టీడీపీ అభ్యర్థి ఓడిపోగా, వైకాపా అభ్యర్థి విజయం సాధించింది.
నలబై ఏళ్ళు ఇండ్రస్టీ అయినా చంద్రబాబును కుప్పం ప్రజలు తరిమి కొట్టారని రోజా చురకలు అంటించారు. కుప్పంలోనే ఇల్లు లేని చంద్రబాబును… హైదరాబాద్ ఇంటికి పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేష్ ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని.. కుప్పం ప్రజలు జగన్ వెంటనే ఉన్నారని తెలిపారు. డిల్లీ చక్రం తిప్పుతాననే చంద్రబాబు…. కుప్పం మున్సిపాలిటీలు బోక్క బోర్ల పడ్డారని అన్నారు.