Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు - శేఖర్ రెడ్డికి లింకులు.. ఆధారాలున్నాయ్ : బొత్స సత్తిబాబు

తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఇసుక కాంట్రాక్టర్ జే శేఖర్ రెడ్డికి ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి మధ్య సంబంధాలు ఉన్నాయని వైకాపా నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఇదే అంశంపై ఆయన బుధవారం మా

Webdunia
బుధవారం, 18 ఏప్రియల్ 2018 (17:00 IST)
తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఇసుక కాంట్రాక్టర్ జే శేఖర్ రెడ్డికి ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి మధ్య సంబంధాలు ఉన్నాయని వైకాపా నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఇదే అంశంపై ఆయన బుధవారం మాట్లాడుతూ, నోట్ల రద్దు సమయంలో చంద్రబాబు - శేఖర్‌ రెడ్డిల మధ్య చాలా లావాదేవీలు జరిగాయని ఆయన ఆరోపించారు.
 
ముఖ్యంగా, పెద్ద నోట్ల రద్దు సందర్భంగా చంద్రబాబు తన ద్వారా 500 కోట్ల రూపాయల బ్లాక్ మనీని మార్చుకున్నారని సీబీఐకు జే.శేఖర్ రెడ్డికి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారని తెలిపారు. ఈ సీబీఐ నివేదిక బయట పడితే చంద్రబాబుతో శేఖర్ రెడ్డికి ఉన్న లింకేంటనేది బయటపడిపోతుందని బొత్స చెప్పారు. 
 
అలాగే, శేఖర్ రెడ్డికి ఏపీ మంత్రి నారా లోకేష్‌కు మధ్య సంబంధాలు ఉన్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేశారనీ బొత్స గుర్తు చేశారు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయారని... పిమ్మట తాను అదే విషయంపై ఆరా తీస్తే చాలా వాస్తవాలు బయటపడ్డాయని బొత్స సత్యనారాయణ వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో శేఖర్ రెడ్డికి ఉన్న చీకటి సంబంధం వ్యవహారాన్ని జనంలోకి తీసుకెళ్తామని బొత్స సత్యనారాయణ ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments