Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎమ్మెల్యేలు ఏమైనా తిక్కనా.... చాలా తెలివైన వాళ్లు: జేసీ దివాకర్ రెడ్డి

తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో వున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి ఝలక్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు ఏమైనా తిక్కనా.. చాలా తెలివైన వాళ్లంటూ

ఎమ్మెల్యేలు ఏమైనా తిక్కనా.... చాలా తెలివైన వాళ్లు: జేసీ దివాకర్ రెడ్డి
, సోమవారం, 16 ఏప్రియల్ 2018 (15:49 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో వున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి ఝలక్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు ఏమైనా తిక్కనా.. చాలా తెలివైన వాళ్లంటూ కౌంటర్ ఇచ్చారు. తాను కూడా పార్లమెంట్‌లో విజయసాయిరెడ్డితో మాట్లాడతానని.. అయినంతమాత్రానికి వాళ్లతో టచ్‌లో వున్నట్లవుతుందా అంటూ ప్రశ్నించారు. 
 
విజయసాయిరెడ్డిని చూస్తే బాగున్నారా అంటూ పలకరిస్తా.. ఎంపీలందరితోనూ మాట్లాడుతా.. వాళ్లతో కలిసి కాఫీ తాగుతూ.. వారి యోగక్షేమాలు కూడా అడిగి తెలుసుకుంటా. అయినంత మాత్రానికే పార్టీ మారుతున్నట్టా? అంటూ జేసీ అడిగారు. వైకాపా నేతలతో మాట్లాడినంత మాత్రానా పార్టీ మారుతున్నట్లవుతుందా? ఎమ్మెల్యేలు చాలా తెలివైన వాళ్లని జేసీ చెప్పారు. 
 
తెలుగుదేశం పార్టీ వాళ్లను జగన్ తీసుకుంటాడని తెలుసు. అర్హులు కాని వాళ్లకు, ప్రజలతో సంబంధం లేనటువంటి వాళ్లకు.. అవినీతిపరులకు టిక్కెట్లు ఇవ్వనని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిరోజూ చెప్తూనే వున్నారు. అలాంటప్పుడు మాజీ ఎమ్మెల్యేలు కొందరు జగన్ దగ్గరకు వస్తారు. వాళ్లకు వైకాపా టిక్కెట్లు ఇవ్వమని జేసీ ఎద్దేవా చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మమ్మ ఇంటికెళ్లి వస్తానంది.. మైలారం రైల్వేస్టేషన్ వద్ద?