Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ వివేకా హత్య కేసు : పులివెందులకు శివశంకర్ రెడ్డి తరలింపు

Webdunia
గురువారం, 18 నవంబరు 2021 (13:48 IST)
మాజీ మంత్రి, వైకాపా సీనియర్ నేత వైఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ జోరుగా సాగుతోంది. ఈ విచారణలో భాగంగా ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన సీబీఐ అధికారులు.. తాజాగా కడప ఎంపీ వైఎస్. అవినాశ్ రెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని  హైదరాబాద్ నగరంలో అరెస్టు చేశారు. 
 
ఆ తర్వాత ఆయన్ను హైదరాబాద్ నుంచి పులివెందులకు తరలించారు. ఉస్మానియా ఆస్పత్రిలో ఆయనకు పూర్తిస్థాయి వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఆయన్ను గురువారం తెల్లవారుజామున సికింద్రాబాద్ కోర్టు న్యాయమూర్తి ఇంటిలో హాజరుపరిచారు. ఆ తర్వాత ఆయన్ను హైదరాబాద్ నుంచి పులివెందులకు దరలించారు. ఇక్కడు వచ్చాక పులివెందుల కోర్టులో హాజరుపరిచయనున్నారు. 
 
ఇదిలావుండగా, వివేకా హత్య కేసులో దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో అనేక మంది పెద్దల పేర్లను బయటపెట్టిన విషయం తెల్సిందే. ముఖ్యంగా, దస్తగిరి వాంగ్మూలం తర్వాత ఈ నెల 15 తేదీన విచారణకు రావాలంటూ శివశంకర్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీచేసింది. అయితే, అనారోగ్య కారణాలతో ఆయన హాజరుకాలేదు. ఈ క్రమంలోనే ఆయన్ను సీబీఐ అరెస్టు చేసింది. 

సంబంధిత వార్తలు

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments