Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ వివేకా హత్య కేసు : పులివెందులకు శివశంకర్ రెడ్డి తరలింపు

Webdunia
గురువారం, 18 నవంబరు 2021 (13:48 IST)
మాజీ మంత్రి, వైకాపా సీనియర్ నేత వైఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ జోరుగా సాగుతోంది. ఈ విచారణలో భాగంగా ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన సీబీఐ అధికారులు.. తాజాగా కడప ఎంపీ వైఎస్. అవినాశ్ రెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని  హైదరాబాద్ నగరంలో అరెస్టు చేశారు. 
 
ఆ తర్వాత ఆయన్ను హైదరాబాద్ నుంచి పులివెందులకు తరలించారు. ఉస్మానియా ఆస్పత్రిలో ఆయనకు పూర్తిస్థాయి వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఆయన్ను గురువారం తెల్లవారుజామున సికింద్రాబాద్ కోర్టు న్యాయమూర్తి ఇంటిలో హాజరుపరిచారు. ఆ తర్వాత ఆయన్ను హైదరాబాద్ నుంచి పులివెందులకు దరలించారు. ఇక్కడు వచ్చాక పులివెందుల కోర్టులో హాజరుపరిచయనున్నారు. 
 
ఇదిలావుండగా, వివేకా హత్య కేసులో దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో అనేక మంది పెద్దల పేర్లను బయటపెట్టిన విషయం తెల్సిందే. ముఖ్యంగా, దస్తగిరి వాంగ్మూలం తర్వాత ఈ నెల 15 తేదీన విచారణకు రావాలంటూ శివశంకర్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీచేసింది. అయితే, అనారోగ్య కారణాలతో ఆయన హాజరుకాలేదు. ఈ క్రమంలోనే ఆయన్ను సీబీఐ అరెస్టు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments