Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ నేతకు దణ్ణం పెట్టి క్షమాపణ చెప్పిన జగన్.. ఎందుకు?

Webdunia
గురువారం, 7 మార్చి 2019 (22:14 IST)
అసలే ఎన్నికలు సమీపిస్తున్నాయి. అందులో సొంత పార్టీ కాదు. ఎవరో పెట్టిన పార్టీని తెచ్చుకున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాగైనా గట్టెక్కాలంటే అతనికి క్షమాపణ చెప్పడమే సరైది దాని అని ఎంచుకున్నారు ప్రధాన ప్రతిపక్ష నేత. వెంటనే ఆయన్ను పిలిచి క్షమాపణ చెప్పేసి కలిసి పనిచేసుకుందామని చెప్పాడు.
 
క్షమాపన చెప్పింది జగన్ అయితే చెప్పించుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శివకుమార్. ఇప్పటికే ఆయన పెట్టిన పార్టీ నుంచి బహిష్కరించేశారు జగన్. దీంతో న్యాయపోరాటానికి సిద్థమయ్యారు. కోర్టుకు వెళ్ళారు.. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ నెల 11వ తేదీలోగా సంజాయిషీ ఇవ్వాలని ఎన్నికల కమిషనర్ ఆదేశించారు. 
 
ఇక వేరే చేసేది లేక జగన్, శివకుమార్‌ను పిలిపించుకుని జరిగిందేదో జరిగిపోయింది. పార్టీ కోసం కష్టపడు. నువ్వు కూడా నాయకుడివే. కలిసి చేసుకుందామంటూ బుజ్జగించి క్షమాపణ చెప్పి పంపేశారట. ఏకంగా జగనే సారీ చెప్పడంతో శివకుమార్ శాంతించినట్లు తెలుస్తోంది. ఈ నెల 11వ తేదీ ఎన్నికల కమిషనర్ దగ్గరకు వెళ్ళి తాను చేసిన ఫిర్యాదును శివకుమార్ వెనక్కి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments