Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాతరలో అసభ్య చేష్టలు.. వారించిన ఎస్ఐను జుట్టుపట్టుకుని చితకబాదిన పోకిరీలు!!

ఠాగూర్
గురువారం, 13 మార్చి 2025 (10:00 IST)
విజయనగరం జిల్లా గుడివాడలో కొందరు పోకిరీలు ఓ మహిళా ఎస్‌ఐను జట్టుపట్టుకుని చితకబాదారు. స్థానికంగా జరిగిన ఓ జాతరలో కొందరు పోకిరీలు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించసాగారు. ఈ విషయాన్ని అక్కడ విధుల్లో ఉండే ఓ మహిళా ఎస్ఐ గుర్తించి, మందలించారు. దీంతో ఆ పోకిరీలంతా కలసి ఆ ఎస్ఐను చుట్టుముట్టి, జట్టుపట్టుకుని కొట్టడంతో ఆమె ప్రాణభయంతో పరుగులు చేశారు. ఈ ఘటనకు సంబంధించి తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
స్థానిక పోలీసుల కథనం మేరకు.. విజయనగరం జిల్లా వేపాడు మండలం గుడివాడ గ్రామంలో మంగళవారం రాత్రి వేణుగోపాలస్వామి జాతర మంగళవారం రాత్రి జరిగింది. దీన్ని పురస్కరించుకుని డ్యాన్స్ బేబీ డ్యాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 
 
మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు హంగామా చేస్తూ డ్యాన్స్ చేస్తున్న యువతులతో అసభ్యకరంగా ప్రవర్తించారు. అక్కడే విధుల్లో ఉన్న పల్లంపూడి ఎస్ఐ బి.దేవి వారిని వారించే ప్రయత్నం చేశారు. దీంతో మరింతగా రెచ్చిపోయిన యువకులు ఎస్ఐపై దాడి చేశారు. ఆమె జుట్టుపట్టుకుని కొట్టారు. 
 
దీంతో ఆమె వారి నుంచి తప్పించుకుని ప్రాణభయంతో పరుగులు తీశారు. సమయంలోని ఓ ఇంట్లోకి వెళ్లి తలదాచుకున్నారు. అయినా వదలని ఓ పోకిరీలు అక్కడికి వెళ్లి నానా రభస చేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోకిరీల దాడిలో ఎస్ఐకు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. మొత్తం 9 మంది నిందితులను అరెస్టు చేశామని మరొకరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments