Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ సీఎం అయిన మరుక్షణం నుంచే టీడీపీ కార్యకర్తలకు వీపు విమానం మోతమోగుతుంది : పెద్దిరెడ్డి

ఠాగూర్
గురువారం, 30 జనవరి 2025 (17:54 IST)
తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మరక్షణం నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వీపు విమానం మోత మోగుతుందని వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. కడప, రాయచోటి వైకాపా కార్యకర్తల సమన్వయకర్తల సమావేశం జరిగింది. ఇందులో మాజీ మంత్రి పాల్గొని ప్రసంగిస్తూ, వచ్చే ఎన్నికల్లో జగన్‌ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు.. అప్పుడు తెదేపా కార్యకర్తల భరతం పడతామని బహిరంగ హెచ్చరికలు జారీచేశారు. 
 
'వైకాపా నాయకులు, కార్యకర్తలను కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి ఇబ్బంది పెడుతోంది. సోషల్‌ మీడియా కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు. గ్రామస్థాయిలో కూడా మన కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ మళ్లీ సీఎం అవుతారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల భరతం పడతాం. 
 
వైకాపా కార్యకర్తలపై చేసిన దాడులకు ప్రతి దాడులు కచ్చితంగా ఉంటాయి. మా తడాఖా ఏందో జగన్‌ సీఎం అయ్యాక వారికి రుచి చూపిస్తాం. ఇక నుంచి కార్యకర్తలకు అండగా ఉంటాం, భరోసా ఇస్తామని జగన్‌ చెప్పారు. జగన్‌ ఆదేశాలను అందరూ పాటించాలి. ఎవరికీ భయపడాల్సిన పనిలేదు' అని పెద్దిరెడ్డి అన్నారు. 
 
కాగా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరులో భారీ మొత్తంలో ప్రభుత్వ అటవీ భూములను ఆక్రమించుకోవడంతోపాటు దట్టమైన అటవీ ప్రాంతంలో విలాసవంతమైన అతిథి గృహాన్ని కూడా నిర్మించుకున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై రాష్ట్ర అటవీశాఖామంత్రి పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు. దీంతో పెద్దిరెడ్డి మీడియా ముందుకు వచ్చి ఈ తరహా బహిరంగ హెచ్చరికలు చేయడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas and Anushka: ప్రభాస్‌తో కలిసి నటిస్తాను అంటోన్న దేవసేన (video)

Krish: పవన్ కళ్యాణ్ అంటే అభిమానమే.. - ఇప్పుడు సినిమా లైఫ్ మూడు గంటలే : క్రిష్ జాగర్లమూడి

అథర్వా మురళి నటించిన యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్

అంకిత్ కొయ్య, నీలఖి ల కెమిస్ట్రీ, స్కూటీ చుట్టూ తిరిగే బ్యూటీ గా లవ్ సాంగ్‌

Rehman: ఏఆర్ రహ్మాన్ బాణీలతో రామ్ చరణ్ పెద్ది ఫస్ట్ సింగిల్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments