Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగన్ మోమయ్యా అంటూ ఓ ఆట ఆడుకున్న టీడీపీ కార్యకర్తలు!! ... అసెంబ్లీ వెనుక గేటు నుంచి రాక!!

ys jagan

వరుణ్

, శుక్రవారం, 21 జూన్ 2024 (15:15 IST)
వైకాపా అధినేత, ఏజీ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టీడీపీ కార్యకర్తలు ఓ ఆట ఆడుకున్నారు. జగన్ మోమయ్య అంటూ ఆయన సమక్షంలోనే ట్రోల్స్ చేశారు. ఏపీలో కొత్త అసెంబ్లీ శుక్రవారం కొలువుదీరింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మల్యేలతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. సభలో ప్రమాణ స్వీకారం చేసేందుకు జగన్ అసెంబ్లీకి వచ్చారు. ఆయన పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అక్షర క్రమంలోకాకుండా మంత్రుల తర్వాత జగన్‌కు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇవ్వాలన్న వైసీపీ అభ్యర్థనకు ముఖ్యంమత్రి, సభానేత నారా చంద్రబాబు నాయుడు పెద్ద మనసుతో అంగీకరించారు. దీంతో మంత్రుల ప్రమాణం ముగియగానే జగన్ ప్రమాణ స్వీకారం పూర్తిచేశారు.
 
అంతకుముందు వైసీపీ అభ్యర్థన మేరకు జగన్ కారును కూడా లోనికి అనుమతించారు. అయితే అందరిలా జగన్ అసెంబ్లీ ప్రాంగణం మెయిన్ గేటు నుంచి కాకుండా వెనకగేటు నుంచి రావడం చర్చనీయాంశమైంది. జగన్ గతంలో సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి మందడం మీదుగా సభకు వచ్చేవారు. అయితే, అమరావతి రైతుల నుంచి నిరసన ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఉద్దేశంతో జగన్ వేరే మార్గం నుంచి వచ్చినట్టు తెలిసింది. అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నప్పటికీ సభ ప్రారంభమైన ఐదు నిమిషాల తర్వాత జగన్ లోపలికి వెళ్లారు. 
 
తన ప్రమాణ స్వీకారానికి సమయం వచ్చినప్పుడు మాత్రమే సభలో అడుగుపెట్టి ప్రమాణ స్వీకారం పూర్తిచేశారు. అంతకుముందు అసెంబ్లీ వద్దకు చేరుకున్న జగన్‌కు చేదు అనుభవం ఎదురైంది. జగన్ కారును చూసిన వెంటనే కొందరు 'జగన్ మోమయ్యా' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ సమయంలో కారు ముందు సీటులో కూర్చొనివున్న జగన్‌కు ఈ అరుపులు వినిపించలేదు. దీంతో ఆయన రెండు చేతులు జోడించి అభివాదం చేస్తూ ముందుకుసాగిపోయారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమరావతి రైల్వేలైన్‌ ప్రతిపాదన.. గెజిట్ నోటిఫికేషన్ విడుదల