Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమలలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలు.. సిఫార్సు లేఖతో 54 మందికి వీఐపీ బ్రేక్ దర్శనం

peddireddy

వరుణ్

, శుక్రవారం, 28 జూన్ 2024 (12:47 IST)
గత ప్రభుత్వంలో మంత్రులు, అధికార పార్టీ నేతలు తిరుమలను తమ అడ్డాగా చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలను నిజం చేస్తూ వీరు చేసిన అక్రమాలు ఇపుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గత ప్రభుత్వం తితిదే పవిత్రతను ఉద్దేశ్యపూర్వకంగా దెబ్బతీసిందని భక్తలు ఆరోపించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. దీనికితోడు, వైకాపా మంత్రులు ఇష్టానుసారంగా సిఫార్సు లేఖలతో అనేక మందిని వీఐపీ బ్రేక్ దర్శనానికి పంపించారు. 
 
ముఖ్యంగా, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు చెందిన మంత్రులు తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తించినట్టు తెలుస్తుంది. గత ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకే లేఖపై ఏకంగా 54 మందికి దర్శనం కల్పించాకరు. దీనికి సంబంధించిన లేఖ ఒకటి ఇపుడు వెలుగులోకి వచ్చింది. తాను పంపిన వారిని దర్శనానికి అనుమతించాలంటూ అప్పటి తితిదే ఈవో ధర్మారెడ్డికి మంత్రి పెద్దిరెడ్డి రాసిన సిఫార్సు లేఖను తెలుగుదేశం పార్టీ తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. 
 
తిరుమలలో వైకాపా పెద్దలు యధేఛ్చగా దందాలు చేశారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్దంగా వీఐపీ బ్రేక్ దర్శనం పేరుతో పెద్దిరెడ్డి ఒకేసారి 54 మందిని పంపించాలని రాసిన సిఫార్సు లేఖ ఇదేనని పేర్కొంది. ఈ బ్రేక్ దర్శనం స్కాంతో పాటు శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్ కుంభకోణంపైనా తితిదే విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం మంత్రి పెద్దిరెడ్డి రాసిన సిఫార్సు లేఖ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

webdunia

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మైనర్ బాలికతో జంప్ అయిన స్కూల్ టీచర్.. ఎక్కడ?