Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిపక్ష నాయకులపై వైసీపీ దాడులు: అచ్చెన్న లేఖ

Webdunia
బుధవారం, 25 నవంబరు 2020 (06:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ప్రతిపక్ష నాయకులపై వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని చెప్పారు. సంతమాగులూరు మండలంలో వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డారని ఆయన చెప్పారు.
 
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి దిగిన టీడీపీ అభ్యర్థులపై ఈ దాడులు జరుగుతున్నాయని అచ్చెన్నాయుడు తెలిపారు. దాడులు, దౌర్జన్యాలకు పాల్పడిన ప్రాంతాల్లో ఎన్నికలు వాయిదా వేయాలని ఆయన కోరారు.

ప్రతిపక్ష అభ్యర్థులకు కేంద్ర భద్రతా దళాలతో రక్షణ కల్పించాలని, ఆన్‌లైన్‌లో నామినేషన్ ప్రక్రియ చేపట్టేందుకు ఏర్పాట్లు చేయాలని ఆయన చెప్పారు.
 
అలాగే, దాడుల నుంచి రక్షణ కోసం కేంద్ర భద్రతా దళాల సహకారంతో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని అచ్చెన్నాయుడు కోరారు.

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. హత్యారాజకీయాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, వైసీపీ నేతలు సృష్టించిన వీరంగంపై సీబీఐ విచారణ జరగాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments