Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిపక్ష నాయకులపై వైసీపీ దాడులు: అచ్చెన్న లేఖ

Webdunia
బుధవారం, 25 నవంబరు 2020 (06:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ప్రతిపక్ష నాయకులపై వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని చెప్పారు. సంతమాగులూరు మండలంలో వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డారని ఆయన చెప్పారు.
 
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి దిగిన టీడీపీ అభ్యర్థులపై ఈ దాడులు జరుగుతున్నాయని అచ్చెన్నాయుడు తెలిపారు. దాడులు, దౌర్జన్యాలకు పాల్పడిన ప్రాంతాల్లో ఎన్నికలు వాయిదా వేయాలని ఆయన కోరారు.

ప్రతిపక్ష అభ్యర్థులకు కేంద్ర భద్రతా దళాలతో రక్షణ కల్పించాలని, ఆన్‌లైన్‌లో నామినేషన్ ప్రక్రియ చేపట్టేందుకు ఏర్పాట్లు చేయాలని ఆయన చెప్పారు.
 
అలాగే, దాడుల నుంచి రక్షణ కోసం కేంద్ర భద్రతా దళాల సహకారంతో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని అచ్చెన్నాయుడు కోరారు.

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. హత్యారాజకీయాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, వైసీపీ నేతలు సృష్టించిన వీరంగంపై సీబీఐ విచారణ జరగాలని కోరారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments