Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం జగన్‌కు భవిష్యత్‌ తెలుస్తుంది : యనమల రామకృష్ణుడు

Webdunia
ఆదివారం, 24 ఏప్రియల్ 2022 (15:03 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి భవిష్యత్ కళ్లముందు తెలుస్తుందని, అందుకే సెంటిమెంట్ ప్రచారానికి తీశారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు జోస్యం చెప్పారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటికే నవ్యాంధ్రను రుణాంధ్రప్రదేశ్‌గా మార్చేశారన్నారు. ఇప్పటికే రూ.7.76 లక్షల కోట్ల అప్పులు ఊబిలోకి నెట్టేశారన్నారు. అందువల్ల సీఎం జగన్ మరోమారు బహిరంగ మార్కెట్‌, కార్పొరేషన్లలై రుణాలు తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం కట్టడి చేయాలని ఆయన కోరారు. 
 
అంతేకాకుండా, సీఎం జగన్‌కు వైకాపా మరోమారు అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ఇపుడే అర్థమైపోయి, భవిష్యత్ కళ్లముందు కనిపిస్తుందన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని తుంగలో తొక్కి తన గురించి, తన పార్టీ గురించే జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారంటూ యనమల మండిపడ్డారు. 
 
అవినీతి సొమ్ముతో వచ్చే ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడాలని జగన్ చూస్తున్నారని అన్నారు. ఏపీలో ఆదాయం లేకపోయినా సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని యనమల అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరినీ సమస్యల్లోకి నెట్టేస్తున్న వైకాపా నేతలు తమ తప్పులను ఎత్తిచూపితే అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments