Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడిని మంచానికి కట్టేసి కిరోసిన్ పోసి తగలబెట్టిన ప్రియురాలు.. ఎక్కడ?

అక్రమ సంబంధం మరో ప్రాణాన్ని బలితీసుకుంది. ప్రియుడిని నమ్మించి ప్రియురాలే హత్య చేసింది. తన శారీరక సుఖం కోసం ఇంటికి వచ్చిన ప్రియుడిని మంచానికి కట్టేసి కిరోసిన్ పోసి తగలబెట్టింది. ఈ దారుణం ప్రకాశం జిల్లా

Webdunia
సోమవారం, 30 జులై 2018 (11:08 IST)
అక్రమ సంబంధం మరో ప్రాణాన్ని బలితీసుకుంది. ప్రియుడిని నమ్మించి ప్రియురాలే హత్య చేసింది. తన శారీరక సుఖం కోసం ఇంటికి వచ్చిన ప్రియుడిని మంచానికి కట్టేసి కిరోసిన్ పోసి తగలబెట్టింది. ఈ దారుణం ప్రకాశం జిల్లా పొదిలిలో జరిగింది.
 
పోలీసుల కథనం మేరకు ఈ వివరాలు ఇలా ఉన్నాయి. పొదిలికి చెందిన షేక్‌ షబ్బీర్‌ (32) మర్రిపూడి పోలీసుస్టేషన్‌లో హోమ్‌గార్డుగా పనిచేస్తున్నాడు. ఈయనకు ఇదే ప్రాంతానికి చెందిన ఇమాంబీ అనే మహిళతో పరిచయమైంది. ఈ పరిచయం వారి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. 
 
ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి కొనకనమిట్ల మండలం చవటపల్లి, పేరారెడ్డిపల్లిలో ఉన్న కోళ్ల ఫారాలను లీజుకు తీసుకుని నడుపుతూ వచ్చారు. ఈ క్రమంలో ఇటీవల కోళ్ల ఫారాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. 
 
ఈ తరుణంలో రెండు రోజుల క్రితం కోళ్ల ఫారం నుంచి మంటలు రావడంతో స్థానికులు వెళ్లి ఇమాంబీని ప్రశ్నించారు. లోపలికి వెళ్లి చూడగా షబ్బీర్‌ కాలిపోయి మృతదేహమై కనిపించాడు. షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు వచ్చాయని ఇమాంబీ నమ్మించేందుకు ప్రయత్నించింది. 
 
హత్యా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు... మృతదేహం ఉన్న తీరు చూస్తే కిరోసిన్‌ పోసి నిప్పంటించినట్టుగా ఉందని నిర్ధారించారు. మృతుడి కాళ్లూ చేతులను గొలుసులతో మంచానికి కట్టేసి ఉన్నాయి. ఇమాంబీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments