Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తమ భర్తలతో సంబంధం పెట్టుకుందనీ.. ఇద్దరు భార్యల ఘాతుకం

తమ భర్తలతో ఓ మహిళ అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను ఇద్దరు భార్యలు కలిసి కొట్టి చంపేశారు. ఈ దారుణం గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

Advertiesment
Guntur
, శుక్రవారం, 27 జులై 2018 (11:41 IST)
తమ భర్తలతో ఓ మహిళ అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను ఇద్దరు భార్యలు కలిసి కొట్టి చంపేశారు. ఈ దారుణం గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
యడ్లపాడు మండలం తిమ్మాపురం ఎస్సీ కాలనీకి చెందిన పుల్లగూర శాంతి (29) అనే వివాహిత అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం పలువురు గ్రామస్థులకు కూడా తెలుసు. ఈ విషయంపై ఆమె చర్యను పలువురు గ్రామస్థులు కూడా ఖండించారు. 
 
ఈ నేపథ్యంలో ఆమె గురువారం సాయంత్రం అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. ఇంటి గోడకు ఉన్న రాతి దూలానికి నవారుతో వేలాడుతూ ఉండటాన్ని ఆమె కుమార్తె జ్యోతి గురువారం సాయంత్రం 5.00 గంటల సమయంలో గమనించి కేకలు వేసింది. 
 
దీనితో చుట్టుపక్కల వారు వచ్చి ఆమెను శాంతిని కిందకు దించి చూడగా ఆమె అప్పటికే మృతిచెందింది. ఆ తర్వాత సమాచారాన్ని పోలీసులకు చేరవేయడంతో వారు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 
 
అయితే, శాంతి మృతిపై బంధువులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరితో శాంతికి వివాహేతర సంబంధం ఉన్న నేపథ్యంలో వారి భార్యలే హత్య చేసి ఉంటారని బంధువులు, భర్త ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధ్యాహ్నం శాంతి ఒంటరిగా ఉండగా ఆ ఇద్దరి భార్యలు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. దీంతో ఆ కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మైనర్ బాలికలతో శృంగారం... విటుడుగా వెళ్ళిన పోలీస్ ఆఫీసర్