Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ ఆస్పత్రిలో మహిళ మృతి, ఐదు తులాల బంగార ఆభరణాలు మాయం

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (13:53 IST)
కరోనా చికిత్స పొందుతూ ఓ మహిళ మరణించింది. ఆమె శరీరంపై ఉన్న 5 తులాల బంగార ఆభరణాలు మాయమైన ఘటన శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలంలో జరిగింది. మండలం లోని ఓ గ్రామానికి చెందిన మహిళ కరోనా బారిన పడి నెల్లిమర్లలోని మిమ్స్ ఆస్పత్రిలో చేరింది. అక్కడ చికిత్స  పొందుతూ పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతి చెందింది. దీంతో మృతదేహాన్ని అంత్యక్రియల కోసం ఇంటికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు.
 
ఈ క్రమంలో మృతదేహంపై కప్పిన కవర్‌ను తొలగించి చూడగా, ఆమె శరీరంపై ఉండాల్సిన బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో వారు ఆందోళనకు దిగారు. బాధిత మహిళ బంధువుల ఆరోపణలపై జిల్లా కోవిడ్ ఆస్పత్రి ప్రత్యేక వైద్యాధికారి హరికిషన్ సుబ్రమణ్యం స్పందించారు. ఆస్పత్రిలో మృతురాలి బంగారు నగలు పోయేందుకు అవకాశం లేదని, అన్ని గదుల్లోను సీసీ కెమరాలు ఉన్నాయని తెలిపారు.
 
నిజానికి కరోనా భయంతో ఎవరు దగ్గరికి వెళ్లే పరిస్థితి కూడా లేదని తెలిపారు. మృతదేహాన్ని బంధువులు తరలించే సమయంలో ఏదో పొరపాటు జరిగి ఉంటుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆస్పత్రి యాజమాన్యానికి తెలియజేస్తామని పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు చేస్తే విచారణ చేపడుతామని నెల్లిమర్ల పోలీసులు తెలిపారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments