Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు, పేద మహిళకు సోనుసూద్ సాయం

ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు, పేద మహిళకు సోనుసూద్ సాయం
, బుధవారం, 26 ఆగస్టు 2020 (13:12 IST)
కరోనా కష్టకాలంలో సాయం చేయాలని కోరిన వెంటనే ప్రతి స్పందిస్తూ సినీ నటుడు సోను సూద్ రియల్ హీరో అనిపించుకుంటున్న విషయం తెలిసిందే. సాయం చేయాలంటూ తనకు వస్తున్న ఫోన్లు, మెసేజ్ పైనే కాకుండా సామాడిక మాద్యమాల ద్వారా, మీడియా ద్వారా తన దృష్టికి వచ్చిన ప్రజల కష్టాలను గురించి తెలుసుకొని ఆయన సాయం చేస్తున్నారు.
 
కర్ణాటకలో యాదగిరి జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రిలో పద్మ అనే ఓ పేద మహిళ ఒకే కాన్పులోమ ముగ్గురు మగ బిడ్డలకు జన్మనిచ్చింది. అయితే రెక్కాడితే గాని డొక్కాడని పద్మ, నాగరాజు దంపతులకు ఆ బిడ్డలను పెంచడం తలకు మించిన భారమైంది. ప్రస్తుతం వారు ఓ చిన్న ఇంట్లో ఉంటున్నారు.
 
ముగ్గురు పిల్లలను ఎలా పెంచాలన్న ఆందోళనలో వారు ఉన్నారు. వారి బాధల గురించి మీడియాలో వచ్చిన వార్తలు సోను సూద్ దృష్టికి వెళ్లడంతో ఆయన దీనిపై స్పందించారు. తాను ఆ ముగ్గురు శిశువుల పోషణ కోసం సాయం చేస్తానని ప్రకటించారు. అంతేకాదు వారి ఇంటికి మరమ్మతులు కూడా చేయిస్తానని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓలాలో భారీ నియామకాలు.. 3 నెలల్లో 2వేల మంది ఇంజనీర్లకు ఉద్యోగాలు