Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులంటే అంత చులకనా... చొక్కా విప్పి కొడతారా: మహిళా ఏఎస్ఐ ఆవేదన

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (08:55 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటన సమయంలో మంత్రి సీదిరి అప్పలరాజు తాను మంత్రినన్న విచక్షణను మరిచిపోయి విధుల్లో ఉన్న సీఐని దుర్భాషలాడారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. విధుల్లో ఉన్న తమ అధికారిని ప్రజాప్రతినిధి దుర్భాషలాడటంపై విశాఖకు చెందిన ఓ మహిళా ఏఎస్ఐ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీనిపై ఆమె సోషల్ మీడియాలో ఓ ఆడియోను పోస్ట్ చేశారు. ఇది ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
"సార్ నమస్తే అంటూ ఆమె తన ఆవేదనను ప్రారంభించారు. పోలీసులంటే అందరికీ లోకువేనా సర్ అని ప్రశ్నిచారు. మీతో మాట్లాడాలన్నా తనకు ఏడుపు వస్తుందన్నారు. ప్రతిసారి పోలీసులను బూతులు తిట్టడమేనా? అని ప్రశ్నించారు. సీఎం ప్రోటోకాల్ ఎంతో కష్టంగా ఉంటుందని పేర్కొన్నారు. మా విధులు మేం నిర్వహించడం కూడా తప్పేనా? అని నిలదీశారు. ఒక ప్రభుత్వ ఉద్యోగిపై అలా తిరగబడటం కరెక్టేనా?" అని ప్రశ్నించారు. 
 
మీ బందోబస్తు కోసం ఉదయం నుంచే రోడ్లపై పడిగాపులు పడుతున్నారు. పై అధికారుల అదేశాలను పాటించడం కూడూ తప్పేనా? అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత రాజకీయ నాయకుడు అయితే మాత్రం పోలీసు ఉద్యోగిపై నోరు పారేసుకుంటారా? అని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments