Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ గారూ.. కవిత గారు రాలేదేం...? దణ్ణం పెట్టి వెళ్లిపోయిన కేసీఆర్

Webdunia
సోమవారం, 27 మే 2019 (12:33 IST)
తిరుమల శ్రీవారిని తెలంగాణా సిఎం కెసిఆర్ దర్శించుకున్నారు. రెండు సంవత్సరాల తరువాత తిరుమల శ్రీవారిని కెసిఆర్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. గత రెండు సంవత్సరాల క్రితం కెసిఆర్ తిరుమలకు వచ్చినప్పుడు కొడుకు కెటిఆర్, కుమార్తె కవిత, అల్లుడు హరీష్ రావులను వెంటపెట్టుకుని దర్శనానికి వచ్చారు. 
 
కానీ ఈసారి వీరెవరు రాలేదు. ముఖ్యంగా కుమార్తె కవిత రాలేదు. కవితకు తిరుమల శ్రీవారు అంటే ఎంతో భక్తి. అయితే ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో ఎంపిగా కవిత ఓడిపోవడం ఆమెను తీవ్ర నిరాశలోకి నెట్టింది. కవితపై ఏకంగా 150 మందికి పైగా పసుపు రైతులు పోటీ చేశారు. రైతు సమస్యలను కెసిఆర్ పట్టించుకోవడం లేదంటూ కవితపై రైతులు పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి చివరకు కవిత ఓడిపోవాల్సి వచ్చింది.
 
దీంతో కవితను తిరుమలకు తీసుకెళదామనుకుని ఒప్పించే ప్రయత్నం చేసినా ఆమె ఒప్పుకోలేదు. తిరుమల శ్రీవారి దర్శనం తరువాత ఆలయం నుంచి బయటకు వస్తున్న కెసిఆర్‌ను మీడియా ఇదే ప్రశ్నించేందుకు ప్రయత్నించింది. సర్.. కవిత గారు.. మీ కొడుకు ఎవరూ రాలేదేంటి అని ప్రశ్నించారు. దీంతో మీడియా ప్రతినిధుల ముఖం చూస్తూ దణ్ణం పెడుతూ కెసిఆర్ వెళ్ళిపోయారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments