Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో జూనియర్ కాలేజీలు ఎప్పటి నుండి ప్రారంభం?

Webdunia
సోమవారం, 13 జులై 2020 (20:09 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కళాశాలలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందుకు సంబంధించి మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ఆగస్టు 3 నుండి కాలేజీలను ప్రారంభించాలని ఇందులో మొత్తం 196 రోజులు పనిదినాలు ఉంటాయని వెల్లడించింది. ఈ మేరకు 2021 అకడమిక్ క్యాలండర్‌ను సిద్దం చేసిన ఉన్నత విద్యాశాఖ, సీబీఎస్ఈ తరహాలో పాఠ్యాంశాలను 30 శాతం తగ్గించాలని పేర్కొన్నది.
 
ఇక ఉదయం సైన్స్, మధ్యాహ్నం ఆర్ట్స్ గ్రూపులకు తరగతులను నిర్వహించాలని, రెండో శనివారం కూడా కాలేజీలను నడిపించాలని, పండుగుల సందర్భంలో మాత్రం ఒకటిరెండు రోజులు సెలవులు ఉంటాయని స్పష్టం చేసింది. అదేవిధంగా విద్యార్థులకు యూనిట్ పరీక్షలు నిర్వహించాలని ఆన్లైన్ పాఠాలు నిమిత్తం వీడియోలను రూపొందించి విడుదల చేస్తామని వెల్లడించింది.
 
యధావిధిగా వచ్చే ఏడాది మార్చిలోనే వార్షికలు పరీక్షలు ఉంటాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇక ప్రతి సబ్జెక్టుకు ఒక వర్క్ బుక్ ప్రత్యేకంగా ఇస్తామని, జేఈఈ మెయిన్ పరీక్షలుకు అనుగుణంగా ఈ వర్క్ బుక్ ఉంటుందని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments