Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలం డ్యాం గేట్లపై నుంచి పొంగిపోర్లుతున్న నీరు.. కర్నూలుకు ముప్పు?

Webdunia
మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (10:10 IST)
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో అధికారులు ఆరు గేట్లను 17 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
 
 మరోవైపు గేట్ల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం కారణంగా స్పిల్‌వే నుంచి కాకుండా 2, 3, 10, 11, 12 గేట్లపై నుంచి నీరు ప్రవహిస్తోంది. ఇంతటి భారీ వరద కొనసాగుతున్నా కనీసం అధికారులెవ్వరూ డ్యామ్ పరిసర ప్రాంతాల్లో కనిపించకపోవడం విమర్శలకు తావిస్తోంది.

జలాశయానికి 3.49 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. ఔట్‌ఫ్లో 3.55 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.90 అడుగుల నీటిమట్టం నమోదైంది. 
 
పూర్తి స్థాయి నిల్వ సామర్ధ్యం 215.80 టీఎంసీలు.. ప్రస్తుతం 215.32 టీఎంసీల వద్ద నీటిమట్టం నమోదైంది. ఇదే క్రమంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2,400 క్యూసెక్కులు, హంద్రీనీవాకు 2,026 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాటుకు 28,500 క్యూసెక్కులు, కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలకు 80 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 

ముందుగా ఇరిగేషన్ అధికారులు మేలుకోకపోవడంతో కర్నూలుకు ముప్పు ఏర్పడింది. మరికొద్ది సేపు ఇలాగే వరద నీరు వచ్చిపడితే కర్నూలు మునగడం ఖాయమని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments