Webdunia - Bharat's app for daily news and videos

Install App

పద్మశ్రీ అవార్డుకు వైజాగ్ డాక్టర్ పేరు నామినేట్

Webdunia
శనివారం, 31 జులై 2021 (16:38 IST)
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశాఖపట్నానికి చెందిన యువ కళాకారుడు డాక్టర్‌ గట్టెం వెంకటేష్‌ తన ప్రత్యేకమైన కళారూపానికిగాను పద్మశ్రీ అవార్డుకు  నామినేట్‌ అయ్యాడు. 
 
ఇప్పటికే తన మైక్రో ఆర్ట్‌ వర్క్‌ కోసం గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులకెక్కిన వెంకటేష్‌.. అగ్గిపుల్లలు, పెన్సిల్లు, చాక్‌పీస్‌లు, టూత్‌పిక్స్‌, బ్యాంగిల్స్‌పై 500కు పైగా సూక్ష్మ శిల్పాలను చెక్కి ఇప్పటివరకు 100 అవార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
 
ఒక కుగ్రామంలో జన్మించిన వెంకటేశ్‌ తండ్రి రైతు, తల్లి గృహిణి. అతడి లక్ష్యాన్ని సాధించడానికి, అభిరుచిని నెరవేర్చడానికి ప్రోత్సహిస్తూ అన్ని విధాలుగా మద్దతుగా నిలిచారు. గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి పట్టభద్రుడైన వెంకటేష్‌.. జర్మనీలోని పీస్ యూనివర్సిటీ నుంచి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్‌లో డాక్టరేట్‌ అందుకున్నాడు.
 
కళలు, చేతిపనుల పట్ల తన అభిరుచిని పంచుకునే ఇతరులకు సహాయం చేయడానికి ‘వెంకీ ఆర్ట్స్’ను స్థాపించి కళాకారులుగా కెరీర్‌ను కొనసాగించాలనుకునే విద్యార్థులకు సహాయపడ్డాడు. ఇప్పటివరకు దాదాపు రెండు వేలకుపైగా విద్యార్థులను తీర్చిదిద్దాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Virgin: ఫోన్ల వర్షం - కానుకల వర్షంతో ప్రేక్షకులకు ఆఫర్ ఇస్తున్న వర్జిన్ బాయ్స్ టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments