Webdunia - Bharat's app for daily news and videos

Install App

పద్మశ్రీ అవార్డుకు వైజాగ్ డాక్టర్ పేరు నామినేట్

Webdunia
శనివారం, 31 జులై 2021 (16:38 IST)
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశాఖపట్నానికి చెందిన యువ కళాకారుడు డాక్టర్‌ గట్టెం వెంకటేష్‌ తన ప్రత్యేకమైన కళారూపానికిగాను పద్మశ్రీ అవార్డుకు  నామినేట్‌ అయ్యాడు. 
 
ఇప్పటికే తన మైక్రో ఆర్ట్‌ వర్క్‌ కోసం గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులకెక్కిన వెంకటేష్‌.. అగ్గిపుల్లలు, పెన్సిల్లు, చాక్‌పీస్‌లు, టూత్‌పిక్స్‌, బ్యాంగిల్స్‌పై 500కు పైగా సూక్ష్మ శిల్పాలను చెక్కి ఇప్పటివరకు 100 అవార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
 
ఒక కుగ్రామంలో జన్మించిన వెంకటేశ్‌ తండ్రి రైతు, తల్లి గృహిణి. అతడి లక్ష్యాన్ని సాధించడానికి, అభిరుచిని నెరవేర్చడానికి ప్రోత్సహిస్తూ అన్ని విధాలుగా మద్దతుగా నిలిచారు. గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి పట్టభద్రుడైన వెంకటేష్‌.. జర్మనీలోని పీస్ యూనివర్సిటీ నుంచి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్‌లో డాక్టరేట్‌ అందుకున్నాడు.
 
కళలు, చేతిపనుల పట్ల తన అభిరుచిని పంచుకునే ఇతరులకు సహాయం చేయడానికి ‘వెంకీ ఆర్ట్స్’ను స్థాపించి కళాకారులుగా కెరీర్‌ను కొనసాగించాలనుకునే విద్యార్థులకు సహాయపడ్డాడు. ఇప్పటివరకు దాదాపు రెండు వేలకుపైగా విద్యార్థులను తీర్చిదిద్దాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments