Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లిఫ్ట్ ఇచ్చాడు, మత్తు మందు ఇచ్చి లాడ్జికి తీసుకెళ్ళి అత్యాచారం చేసాడు

లిఫ్ట్ ఇచ్చాడు, మత్తు మందు ఇచ్చి లాడ్జికి తీసుకెళ్ళి అత్యాచారం చేసాడు
, శనివారం, 31 జులై 2021 (16:04 IST)
యువతిని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డ వివాహితుడి ఉదంతం తిరుపతిలో వెలుగులోకి వచ్చింది. తిరుపతి రూరల్ మండలానికి చెందిన ఒక యువతి ఈ నెల 28వ తేదీన సాయంత్రం తిరుపతి నగరంలోకి రావడానికి ఆటో కోసం ఎదురుచూస్తోంది. ఎంతసేపటికి ఆటో రాలేదు. 
 
అటువైపుగా వెళుతున్న తిరుపతి బిటిఆర్ కాలనీకి చెందిన నాగేంద్రబాబు అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై వెళుతూ యువతిని గమనించాడు. ఆమెకు మాయమాటలు చెప్పాడు. నగరంలో విడిచిపెడతానని నమ్మించాడు.
 
ఆ తరువాత నగరంలోకి రాగానే కూల్‌డ్రింగ్ తాగుదామన్నాడు. నాగేంద్రబాబు నిజస్వరూపం తెలియని యువతి సరేనంది. అప్పటికే తన దగ్గర ఉన్న నిద్రమాత్రలను కూల్‌డ్రింక్‌లో కలిపి యువతికి ఇచ్చేశాడు. దీంతో ఆ యువతి డ్రింక్ తాగగానే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది.
 
శ్రీనివాసం వసతి సముదాయాల సమీపంలో తన స్నేహితుడు నడుపుతున్న లాడ్జికి ఆ యువతిని తీసుకెళ్ళి అత్యాచారం చేశాడు నాగేంద్రబాబు. ఆమె మేల్కొన్న తరువాత విషయం బయటకు చెబితే చంపేస్తానన్నాడు. దీంతో ఏం చేయాలో పాలుపోక ఆ యువతి ఇంటికి వెళ్ళిపోయింది. 
 
అయితే ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో అనుమానంతో కుటుంబ సభ్యులు ప్రశ్నించగా అసలు విషయాన్ని బయటపెట్టింది. నాగేంద్రబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. వైద్య పరీక్షల నిమిత్తం యువతిని ఆసుపత్రికి తరలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భగత్ సింగ్ నాటకం కోసం రిహార్సల్ : ఉరి బిగించుకుని బాలుడి మృతి