ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం...

Webdunia
శుక్రవారం, 26 ఆగస్టు 2022 (14:26 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్లీలను నిషేధించింది. దీంతో ఇకపై కేవలం గుడ్డతో తయారుచేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు మాత్రమే వినియోగించాల్సివుంటుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. 
 
ఆయన శుక్రవారం విశాఖలో పర్యటించారు. విశాఖలోని ఏయూ కన్వెన్షన్ సెంటరులో పార్లే ఫర్ ది ఓషన్స్ అనే సంస్థతో ఒక ఒప్పందాన్ని ప్రభుత్వం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, ప్లాస్టిక్ ఫ్లెక్సీల బ్యాన్ తొలి అడుగుగా ఆయన చెప్పారు. 2027 నాటికి ఏపీని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మారుస్తామని తెలిపారు. 
 
విశాఖలో ప్రపంచంలోనే అతిపెద్ద బీచ్ క్లీనింగ్ జరిగిందన్నారు. దాదాపు 76 టన్నుల ప్లాస్టిక్ వ్యవర్థాలను సముద్రం నుంచి తొలగించామని చెప్పారు. సముద్రాన్ని, ఏపీ తీరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. 
 
పార్లే సంస్థ సముద్రం నుంచి ప్లాస్టిక్ వ్యవర్థాలను బయటకు తీస్తుందని, వీటిని రీ సైక్లింగ్ చేసి పలు ఉత్పత్తులను ప్రభుత్వం తయారు చేస్తుందన్నారు. పార్లే ఫ్యూచర్ ఇనిస్టిట్యూట్‌ను ఏపీలో ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఆశించకండి : రాజ్ నిడిమోరు మాజీ భార్య

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

Allu Arjun : కున్రిన్ పేరుతో జపనీస్ థియేటర్లలోకి అల్లు అర్జున్... పుష్ప 2

Arnold : అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీమియర్‌ చూసి అర్నాల్డ్ ష్వార్జెనెగర్ ప్రశంస

Chiranjeevi: విక్టరీ వెంకటేష్ ఎనర్గి ప్రతి క్షణం ఆనందం కలిగించింది : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments