Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేడు కృష్ణా జిల్లాలో సీఎం జగన్ పర్యటన - వైఎస్ఆర్ నేతన్న నేస్తం

నేడు కృష్ణా జిల్లాలో సీఎం జగన్ పర్యటన - వైఎస్ఆర్ నేతన్న నేస్తం
, గురువారం, 25 ఆగస్టు 2022 (12:16 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి బుధవారం కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పెడనలో జరిగే కార్యక్రమంలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం కింద నాలుగో విడత నిధులను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. 
 
ఇందుకోసం ఆయన బుధవారం ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరిన ఆయన పెడన బంటుమిల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఆ తర్వాత వైఎస్ఆర్ నేతన్న నేస్తం లబ్ధిదారులకో ముఖాముఖీగా మాట్లాడారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన నేరుగా తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుకుంటారు. 
 
మరోవైపు, నేత కార్మికులకు అండగా ఉండేందుకు వీలుగా ప్రభుత్వం ఒక యేడాదికి రూ.24 వేలు చొప్పున ఆర్థిక సాయం చేస్తున్న విషయం తెల్సిందే. ఆ విధంగా ఐదేళ్ళలో మొత్తం రూ.1.20 లక్షలను జమ చేస్తారు. ఇప్పటికే మూడు విడతల్లో లబ్ధిదారుల ఖాతాల్లో ఆయన నగదు జమ చేశారు. ఇపుడు నాలుగో విడత కార్యక్రమంలో భాగంగా బుధవారం నిధులను జమ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మునుగోడు బరిలో వైఎస్ఆర్టీపీ అభ్యర్థి?