Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా కూతురుపై రెక్కీ నిర్వహించిన వ్యక్తి అరెస్ట్

Webdunia
శనివారం, 14 ఆగస్టు 2021 (16:13 IST)
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కొత్త మ‌లుపు ఇది. పెద్దాయ‌న హ‌త్య చేసింది ఎవ‌రు అనేది సీబీఐ విచార‌ణ కొన‌సాగుతుండ‌గా, క‌థ ప‌లు మ‌లుపులు తిరుగుతోంది.

తాజాగా వివేకా కుమార్తెను చంపేందుకు రెక్కీ నిర్వ‌హిస్తున్న వ్య‌క్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీబీఐ కేసు విచారిస్తున్న తరుణంలో తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన కుమార్తె సునీతారెడ్డి డీజీపీ, సీబీఐ, కడప జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఓ వ్యక్తి తమ ఇంటి ముందు రెక్కీ నిర్వహించాడని ఆరోపిస్తూ లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.

ఈ నెల 10న ఆ అనుమానితుడు తమ ఇంటి చుట్టూ తిరిగాడని, ఫోన్ కాల్స్ కూడా చేశాడని సునీతరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. అందుకు సంబంధించి సీసీ ఫుటేజ్‌ను కూడా పోలీసులకు అందజేశారు. దీంతో పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు నిందితుడు మణికంఠారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. రెక్కీ నిర్వహించడానికి కారణాలు ఏంటి? ఫోన్లు ఎవరెవరికి చేశారు? అన్న దానిపై ఆరా తీస్తున్నారు.

దీనితో ఇపుడు క‌థ కొత్త మ‌లుపు తిరిగిన‌ట్ల‌యింది. అస‌లు మ‌ణి కంఠారెడ్డి ఈ రెక్కీ ఎందుకు చేస్తున్నాడు? ఎవ‌రు ఆయ‌న‌తో ఈ ప‌నులు చేయిస్తున్నార‌నే కోణంలో సి.బి.ఐ. విచార‌ణ మ‌లుపు తిరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments