Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో వందే భారత్ రైలుపై రాళ్లదాడి

Webdunia
గురువారం, 12 జనవరి 2023 (08:46 IST)
ఈ నెల 19వ తేదీ నుంచి సికింద్రాబాద్ - విశాఖపట్టణంల మధ్య వందే భారత్ రైలు సేవలు ప్రారంభంకానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సికింద్రాబాద్ స్టేషన్‌లో జరిగే కార్యక్రమంలో పచ్చజెండా ఊపి రైలును ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో ఈ రైలు ట్రయల్ రన్ కోసం బుధవారం విశాఖపట్టణంకు తరలించారు. నిర్వహణ పర్యవేక్షణలో భాగంగా బుధవారం వైజాగ్‌కు వంందే భారత్ రైలు వచ్చింది. అయితే, ఈ రైలుపై కొందరు అకతాయిలు రాళ్లతో దాడి చేశారు. 
 
ఈ దాడిలో రెండు బోగీల అద్దాలు పగిలిపోయాయి. ట్రయల్ రన్ కోసం చెన్నై నుంచి విశాఖకు వచ్చిన ఈ రైలు మర్రిపాలెం యార్డుకు తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఇది రాళ్లదాడేనని వాల్తేరు డివిజన్ రైల్వే అధికారులు నిర్ధారించారు. మరోవైపు, ఈ ఘటనపై డీఆర్ఎం అనూప్ సత్పతి విచారణకు ఆదేశించారు. రైల్వే ఆస్తులు కూడా ప్రజా ఆస్తులే అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments