తెరుచుకోని టిటిడి వెబ్ సైట్, ఇంటర్నెట్ సెంటర్ల వద్ద భక్తుల పడిగాపులు

Webdunia
బుధవారం, 28 జులై 2021 (18:27 IST)
ఆగష్టు నెలకు సంబంధించిన దర్సన టోకెన్లు విడుదలైపోయాయి. హాట్ కేకుల్లా భక్తులు టోకెన్లను పొందారు. అయితే కొన్ని టోకెన్లు మిగిలాయి. 3వేల టోకెన్లు దాకా ఉన్నాయి. ఆగష్టు 31వ తేదీ వరకు ఈ టోకెన్లు 3 వేలు దాకా ఉన్నట్లు టిటిడి తెలిపింది. కావాల్సిన భక్తులు ఈరోజు ఉదయం 11 గంటలకు ఆన్ లైన్లో బుక్ చేసుకోవచ్చని చెప్పింది.
 
దీంతో భక్తులు స్వామవారి దర్సన టోకెన్ల కోసం తిరుపతి బాలాజీ ఎపి.జిఓవి.ఇన్ వెబ్ సైట్‌ను ఓపెన్ చేశారు. ఇంటర్నెట్ సెంటర్ల వద్ద టోకెన్ల పొందేందుకు భక్తులు బారులు తీరారు. చాలాసేపటి వరకు ఆ సైట్ ఓపెన్ కాలేదు. సుమారు గంటపాటు శ్రమించి చివరకు భక్తులు నిరాశకు గురయ్యారు.
 
అయితే మధ్యాహ్నం 1 గంట తరువాత టిటిడి మరోసారి ఒక ప్రకటన విడుదల చేసింది. భక్తులెవరూ నిరాశకు గురికావాల్సిన అవసరం లేదు. మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ అవుతుందని తెలిపింది. అయినా కూడా సైట్ ఓపెన్ కాలేదు. 
 
ఆఫ్ లైన్లో టిక్కెట్లు ఆగిపోవడం.. కనీసం ఆన్ లైన్లోనైనా టోకెన్లు పొంది స్వామివారి దర్సనం పొందాలనుకుంటున్న శ్రీవారి భక్తులు సైట్ ఓపెన్ కావడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే టోకెన్లు విడుదల చేసే తిరుపతిలోని ఇడిపి కార్యాలయంలో సాంకేతిక లోపమే కారణమని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nattikumar: తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రజాస్వామ్య పద్ధతులు లేకుండానే కొనసాగుతోంది

ఎగ్జిబిటర్ల సమస్యల పరిష్కారినికి సిద్ధం - దానితోపాటు నిర్మాతల సమస్య లూ పరిష్కారం కావాలి

Nag Ashwin: రుత్విక్ కి రాజా ది రాజా జస్ట్ బిగినింగ్ మాత్రమే : నాగ్ అశ్విన్

Anil Ravipudi: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన శ్రీనివాస మంగపురం లోని మంగా మంగా సాంగ్

మరో గ్లోబల్ రికార్డ్ క్రియేట్ చేసిన విరోష్ జోడి.. కపుల్ యాడ్ కు 9.1 మిలియన్ లైక్స్

తర్వాతి కథనం
Show comments