Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరుచుకోని టిటిడి వెబ్ సైట్, ఇంటర్నెట్ సెంటర్ల వద్ద భక్తుల పడిగాపులు

Webdunia
బుధవారం, 28 జులై 2021 (18:27 IST)
ఆగష్టు నెలకు సంబంధించిన దర్సన టోకెన్లు విడుదలైపోయాయి. హాట్ కేకుల్లా భక్తులు టోకెన్లను పొందారు. అయితే కొన్ని టోకెన్లు మిగిలాయి. 3వేల టోకెన్లు దాకా ఉన్నాయి. ఆగష్టు 31వ తేదీ వరకు ఈ టోకెన్లు 3 వేలు దాకా ఉన్నట్లు టిటిడి తెలిపింది. కావాల్సిన భక్తులు ఈరోజు ఉదయం 11 గంటలకు ఆన్ లైన్లో బుక్ చేసుకోవచ్చని చెప్పింది.
 
దీంతో భక్తులు స్వామవారి దర్సన టోకెన్ల కోసం తిరుపతి బాలాజీ ఎపి.జిఓవి.ఇన్ వెబ్ సైట్‌ను ఓపెన్ చేశారు. ఇంటర్నెట్ సెంటర్ల వద్ద టోకెన్ల పొందేందుకు భక్తులు బారులు తీరారు. చాలాసేపటి వరకు ఆ సైట్ ఓపెన్ కాలేదు. సుమారు గంటపాటు శ్రమించి చివరకు భక్తులు నిరాశకు గురయ్యారు.
 
అయితే మధ్యాహ్నం 1 గంట తరువాత టిటిడి మరోసారి ఒక ప్రకటన విడుదల చేసింది. భక్తులెవరూ నిరాశకు గురికావాల్సిన అవసరం లేదు. మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ అవుతుందని తెలిపింది. అయినా కూడా సైట్ ఓపెన్ కాలేదు. 
 
ఆఫ్ లైన్లో టిక్కెట్లు ఆగిపోవడం.. కనీసం ఆన్ లైన్లోనైనా టోకెన్లు పొంది స్వామివారి దర్సనం పొందాలనుకుంటున్న శ్రీవారి భక్తులు సైట్ ఓపెన్ కావడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే టోకెన్లు విడుదల చేసే తిరుపతిలోని ఇడిపి కార్యాలయంలో సాంకేతిక లోపమే కారణమని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments