Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాడిందే పాడరా.. పాచిపళ్ళ దాసరా... ప్రత్యేక హోదాపై కేంద్రం మాట ఇదే

Webdunia
మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (11:18 IST)
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో వైకాపా విపక్ష నేత ఎంపీ మిథున్ రెడ్డి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని మరోమారు ఆయన డిమాండ్ చేశారు. అలాగే, టీడీపీ ఎంపీ కేశినేని నాని కూడా ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తారు. 
 
దీనికి ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ సమాధానమిచ్చారు. జాతీయాభివృద్ధి మండలి సమావేశంలో ప్రత్యేక హోదా ఏయే రాష్ట్రాలకు కల్పించాలో స్పష్టంగా వర్గీకరించారని తెలిపారు. 2014 ఫిబ్రవరిలో అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌.. నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చిన మాట వాస్తవమేనని, అయితే 14వ ఆర్థిక సంఘం సిఫారసుల తర్వాత ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా లేకుండా పోయిందని గుర్తుచేశారు. 
 
విభజన చట్టం కింద ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి తోడ్పడేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ఇందులోభాగంగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని తెలిపారు. కాగా, గతంలో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తమ పార్టీకి 25 మంది ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామంటూ ప్రగల్భాలు పలికారు. కానీ, ఇపుడు 22 మంది ఎంపీలు గెలిచినా ప్రత్యేక హోదాపై ఎలాంటి పోరాటం చేయకపోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments