Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎత్తి దింపుడు పథకంగా కాళేశ్వరం : దత్తాత్రేయ

Webdunia
ఆదివారం, 4 ఆగస్టు 2019 (18:23 IST)
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఎత్తి దింపుడు పథకంగా మారిందని కేంద్రమాజీమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎవరి మాట వినకుండా కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలతో వెళ్లారన్నారు. సాంకేతిక లోపం కారణంగా మేడిగడ్డ అన్నారం బ్యారేజి నుంచి తిరిగి కాళేశ్వరంలోకే నీళ్లు వస్తున్నాయని.. దీంతో రూ.80 వేల కోట్ల నష్టం జరుగుతుందన్నారు. 
 
నష్టానికి బాధ్యత కేసీఆర్ వహించాలన్నారు. ఈ విషయంపై ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సాంకేతిక నిపుణులు, ప్రతిపక్షాల సలహాలు తీసుకోవాలని.. కేసీఆర్ తప్పిదం రాష్ట్రానికి శాపంగా మారిందన్నారు. రాష్ట్రంలో వారం రోజుల నుండి పడుతున్న వర్షాల వల్ల చాలా మంది అనారోగ్యబారిన పడుతున్నారని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా, డెంగు, చికెన్ గున్యా బారిన పడుతున్నారన్నారు. 
 
సరైన సమయంలో రక్త పరీక్షలు చేయకపోవడం వల్ల చనిపోతున్నారని తెలిపారు. ప్రభుత్వ హస్పిటల్‌లో సరిపోను డాక్టర్లు, వసతులు లేని కారణంగా ప్రైవేటు హాస్పిటల్స్‌కు వెళ్తున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రొటెక్టెడ్ వాటర్ ఏర్పాటు చేయాలన్న ఆయన.. గిరిజన ప్రాంతాల్లో దుప్పట్లు సరఫరా చేయాలని తెలిపారు. ప్రైమరీ హెల్త్ సెంటర్లలో వసతులు కల్పించాలని సూచించిన దత్తన్న.. బీజేపీ సభ్యత్వం చాలా వేగవంతంగా జరుగుతోందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కవిన్, అపర్ణాదాస్ నటించిన పాపా మెప్పించిందా... రివ్యూ

Nayanatara: ముస్సోరీలో చిరంజీవి157 చిత్రం షూటింగ్ లో ఎంట్రీ ఇచ్చిన నయనతార

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments