Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కన్నీళ్లు పెట్టుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్

తెలంగాణా ముఖ్యమత్రి కె. చంద్రశేఖర్ రావు నాలుగవ అక్కయ్య లీలమ్మ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఆమె స్వస్థలం సిరిసిల్ల జిల్లా మధిర గ్రామం. గత కొంతకాలంగా హైదారబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోదరి మరణవార్త తెలిసిన సీఎం కేసీఆర్ హుటాహుటని ఢిల

కన్నీళ్లు పెట్టుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్
, సోమవారం, 6 ఆగస్టు 2018 (19:29 IST)
తెలంగాణా ముఖ్యమత్రి కె. చంద్రశేఖర్ రావు నాలుగవ అక్కయ్య లీలమ్మ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఆమె స్వస్థలం సిరిసిల్ల జిల్లా మధిర గ్రామం. గత కొంతకాలంగా హైదారబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోదరి మరణవార్త తెలిసిన సీఎం కేసీఆర్ హుటాహుటని ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు.
 
హైదరాబాద్ వచ్చిన వెంటనే అల్వాలోని మంగాపురం కాలనీకి వెళ్లిన కేసీఆర్... అక్క లీలమ్మ ఇంటికి వెళ్లారు. ఆమె భౌతికకాయాన్ని చూసి చంద్రశేఖర్ రావు చలించిపోయారు. తోబుట్టువు మృతి చెందడంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. కేసీఆర్‌తో పాటు కేటీఆర్, కవిత, హరీష్‌రావు... ఇతర కుటుంబసభ్యులు లీలమ్మ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆందోళనకరంగా కరుణానిధి ఆరోగ్యం...