Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అన్నయ్య అత్యాచారం చేశాడా? గమ్మునుండు... పరువుపోద్ది...

అమ్మాయిలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కుటుంబ సభ్యులే అత్యాచారాలకు పాల్పడుతున్న దారుణ స్థితి ఇప్పుడు చాలాచోట్ల కనబడుతోంది. కడుపులో పెట్టుకుని కాపాడాల్సిన తండ్రి, మానప్రాణాలను రక్షించాల్సిన సోదరులు కొన్నిచోట్ల అబలలను కాటేస్తున్న దారుణాలు ఇటీవలి కాలంల

అన్నయ్య అత్యాచారం చేశాడా? గమ్మునుండు... పరువుపోద్ది...
, బుధవారం, 25 జులై 2018 (16:30 IST)
అమ్మాయిలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కుటుంబ సభ్యులే అత్యాచారాలకు పాల్పడుతున్న దారుణ స్థితి ఇప్పుడు చాలాచోట్ల కనబడుతోంది. కడుపులో పెట్టుకుని కాపాడాల్సిన తండ్రి, మానప్రాణాలను రక్షించాల్సిన సోదరులు కొన్నిచోట్ల అబలలను కాటేస్తున్న దారుణాలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. తాజాగా చండీఘర్‌లో చోటుచేసుకున్న దారుణం ఇలా వుంది. 
 
11 ఏళ్ల బాలికపై 22 ఏళ్ల సోదరుడు గత కొన్ని నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని ఆ బాలిక తన తల్లికి చెప్పింది. ఐతే విషయాన్ని విన్న తల్లి కుమారుడిపై చర్య తీసుకోవాల్సింది పోయి... గమ్మునుండు... పరువు పోతుంది. చేస్తే చేశాడులే అంటూ ఆమెకు సర్దిచెప్పింది. అంతటితో ఊరుకోకుండా ఆమె మతిభ్రమించి మాట్లాడుతుందంటూ తాంత్రికవేత్తల వద్దకు తీసుకెళ్లింది. 
 
కానీ ఆ బాలికపైన సోదరుడు మాత్రం ప్రతిరోజూ అత్యాచారానికి పాల్పడుతూనే వున్నాడు. చివరికి బాధిత బాలిక విషయాన్ని తను చదువుకుంటున్న పాఠశాలలో చెప్పేసరికి వారు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వారణాసిలో మోదీకి పోటీగా ప్రియాంకా గాంధీ..?